Governor: పశ్చిమ బెంగాల్‌కు నూతన గవర్నర్‌ నియామకం

పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. నూతన గవర్నర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి డా.సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 17 Nov 2022 21:09 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. నూతన గవర్నర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి డా.సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సి.వి.ఆనంద బోస్‌ బెంగాల్‌కు రెగ్యులర్‌ గవర్నర్‌గా కొనసాగుతారని పేర్కొన్నారు.

గతంలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పనిచేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మణిపూర్‌ గవర్నర్‌ లా గణేషన్‌ అయ్యర్‌కు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో జులై నుంచి ఆయనే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా బెంగాల్‌కు పూర్తికాలం గవర్నర్‌గా డా.సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేరళకు చెందిన ఆనంద బోస్‌ గతంలో ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం  మేఘాలయ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని