Farm Laws: నేను అలా చెప్పలేదు: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

‘మూడు వ్యవసాయ చట్టాలను కొందరు నల్ల చట్టాలుగా అభివర్ణించి వివాదాలు సృష్టించారు. అందువల్లే రద్దు చేశాం. అయితే, మేం ఒక్క అడుగు వెనక్కి వేశామంతే. మళ్లీ ముందడుగు వేస్తాం’అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను

Updated : 26 Dec 2021 12:37 IST

ఇండోర్‌: ‘మూడు వ్యవసాయ చట్టాలను కొందరు నల్ల చట్టాలుగా అభివర్ణించి వివాదాలు సృష్టించారు. అందువల్లే రద్దు చేశాం. అయితే, మేం ఒక్క అడుగు వెనక్కి వేశామంతే. మళ్లీ ముందడుగు వేస్తాం’అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. విపక్షాలు సైతం కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డాయి. పలు రాష్ట్రాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపా ప్రభుత్వం.. తిరిగి సాగు చట్టాలను తీసుకొచ్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పష్టత ఇచ్చారు. తను అలా చెప్పలేదని, ప్రభుత్వం ఆ చట్టాలను తిరిగి తీసుకురాదని వెల్లడించారు.

‘మూడు సాగు చట్టాలను తిరిగి తీసుకొస్తామని నేను చెప్పలేదు. కేంద్రం మంచి చట్టాలను రూపొందించింది. కానీ, కొన్ని కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మాత్రమే చెప్పాను’’అని కేంద్ర మంత్రి తోమర్‌ స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరపాటు కొనసాగిన రైతుల నిరసనలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే స్వయంగా రైతులకు క్షమాపణ తెలిపారు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించడంతో రైతులు ఆందోళనకు తాత్కాలికంగా ముగింపు పలికి ఇళ్లకు వెళ్లిపోయారు. 

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని