pok: పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా రహస్య సర్వే..!
భారత వ్యూహకర్తల నోటివెంట తరచూ వినిపించే పదం ‘టూఫ్రంట్ వార్’. అంటే ఏకకాలంలో చైనా, పాక్ సైన్యాలను భారత్ ఎదుర్కోవాల్సిరావడం. ఇటీవల కాలంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు మన వ్యూహకర్తల అంచనాలకు తగ్గట్లే ఉంటున్నాయి.
* సమన్వయం పెంపునకు ఇరుదేశాల యత్నాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత వ్యూహకర్తల నోటివెంట తరచూ వినిపించే పదం ‘టూఫ్రంట్ వార్’. అంటే ఏకకాలంలో చైనా, పాక్ సైన్యాలను భారత్ ఎదుర్కోవాల్సిరావడం. ఇటీవల కాలంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు మన వ్యూహకర్తల అంచనాలకు తగ్గట్లే ఉంటున్నాయి. పాక్-చైనాల మధ్య సైనిక సహకారం పెరిగిపోయింది. ఇటీవలే చైనా అత్యాధునిక ఫ్రిగేట్ను పాకిస్థాన్కు బహూకరించింది. ఈ వార్త పూర్తిగా కనుమరుగు కాకముందే మరో విషయం బయటకు వచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా దళాల కదలికలు పెరిగిపోయాయి. అదే సమయంలో పీఎల్ఏ దళాలకు సహకరించేందుకు పాక్ అధికారులు చైనా చేరుకొన్నారు.
పీవోకే సరిహద్దు పోస్టుల్లో సమాచార సేకరణ..
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సిబ్బంది పాక్ ఆక్రమిత కశ్మీర్లోని సరిహద్దు చెక్పోస్టులు, గ్రామాల్లో రహస్య సర్వే నిర్వహించారు. ఈ విషయాన్ని భారతీయ దళాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. దాదాపు 40 మందికిపైగా చైనా సైనికులను నీలం వ్యాలీ, కెల్, జురా,లీపా సెక్టార్లలో నెల రోజుల క్రితం గుర్తించారు. వారు ఐదు నుంచి ఆరుగురు సభ్యుల బృందాలుగా విడిపోయి పీవోకేలోని పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు అక్కడ అత్యాధునిక గ్రామాలను నిర్మించేందుకు ఆసక్తి చూపారు. ఈ గ్రామాలు సైనిక, పౌర అవసరాలకు వినియోగించవచ్చు. ఇటువంటి గ్రామాన్నే అరుణాచల్ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రదేశంలో చైనా నిర్మించింది.
పీఎల్ఏ ఫార్మేషన్ హెడ్క్వార్టర్స్లో పాక్ సైనిక అధికారులు..
భారత్ సరిహద్దు బాధ్యతలను చైనాలోని పశ్చిమ థియేటర్ కమాండ్ చూసుకొంటోంది. దీనికి కమాండర్గా ఇటీవలే వాంగ్ హెజాంగ్ను నియమించారు. ఇక చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్లోని జాయింట్ స్టాఫ్ డిపార్ట్మెంట్లో పాకిస్థాన్కు చెందిన కర్నల్ ర్యాంక్ అధికారిని నియమించినట్లు సమాచారం. ఇరు దేశాలు సేకరించే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడానికి వీలుగా ఈ నియామకం జరిగింది. చైనా సైన్యం దాడులు చేయడానికి, శిక్షణ, ప్లానింగ్, వ్యూహాల తయారీ బాధ్యత సెంట్రల్ మిలటరీ కమిషన్దే. దీంతోపాటు చైనాలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయంలో దాదాపు 10 మంది పాక్ సైనిక అధికారులను ‘డిఫెన్స్ అటాచీ’లుగా నియమించింది. వీరు చైనా నుంచి ఆయుధ సమీకరణకు పాక్కు చేదోడు వాదోడుగా ఉంటారు.
సీపెక్ రక్షణకు ప్రత్యేక దళం..
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ రక్షణ నిమిత్తం 9,000 మంది సైనికులు, 6,000 మంది పారామిలటరీ సిబ్బందితో ఓ దళాన్ని ఏర్పాటు చేసినట్లు డాన్ పత్రిక 2016లో వెల్లడించింది. సీపెక్ , చైనా ఉద్యోగుల రక్షణ నిమిత్తం డివిజన్ స్థాయిలో భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తామని పాక్ 2019లో పేర్కొంది.
చైనా నుంచి పాక్కు దండిగా ఆయుధాలు..
చైనా నుంచి పాకిస్థాన్కు కుప్పలు తెప్పలుగా ఆయుధాలు చేరుతున్నాయి. ఇటీవలే చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించిన టైప్ 054ఏ/పి ఫ్రిగేట్ను పాక్ నావికా దళానికి అందజేశారు. ఈ ఏడాది ఆరంభంలో చైనా ప్రభుత్వ రంగ సంస్థ నోరింకో తయారు చేసిన వీటీ-4 ట్యాంకులను పాక్ సైన్యంలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే వింగ్లూంగ్ శ్రేణి సాయుధ డ్రోన్ల విక్రయాలకు రంగం సిద్ధమైంది.
ఇరు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకొంటూ వెళుతున్నాయి. గతేడాది పీఎల్ఏ, పాక్ వాయుసేన కలిసి సింధ్లో ‘షహీన్-9’ యుద్ధవిన్యాసాలను నిర్వహించాయి. సాధారణ యుద్ధవిన్యాసాలను మిత్ర దేశాల మధ్య అవగాహన పెంచుకోవడానికి, రణక్షేత్రంలో సమన్వయ పర్చుకోవడానికి నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మే నెలలో ఉభయ దేశాల సైన్యాలు టిబెట్ రీజియన్లో కూడా యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
ఎయిరిండియా (Air India Express)లో కొందరు క్యాబిన్ సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. -
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..? -
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్ అభివర్ణించింది. -
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు