కొవిడ్ మూలాలు: దర్యాప్తు జరిపినా..వీడని గుట్టు!
కొవిడ్ మూలాలపై మరోసారి దర్యాప్తును కొనసాగించాలని పిలుపునిస్తూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం బహిరంగ లేఖ విడుదల చేసింది.
మరోసారి దర్యాప్తు చేయాలంటున్న అంతర్జాతీయ నిపుణులు
షాంఘై: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 మహమ్మారి మూలాలను కనిపెట్టేందుకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగింది. అయినప్పటికీ కొవిడ్ మూలాలపై ఎలాంటి స్పష్టత రాలేదు. వీటి మూలాలను ప్రపంచం తెలుసుకోవడం దరిదాపుల్లో కనిపించడం లేదని అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దర్యాప్తును కొనసాగించాలని పిలుపునిస్తూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం బహిరంగ లేఖ విడుదల చేసింది.
సంవత్సరం గడిచినా..యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్ మూలాలను కనుక్కోవడంలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ నిపుణులు నికోలయ్ పెట్రోవ్స్కై అభిప్రాయపడ్డారు. కొవిడ్ మూలాలపై వస్తోన్న వాదనలకు జవాబిచ్చే విధంగా స్వతంత్ర, నిస్పక్షపాత దర్యాప్తును ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయలేకపోయిందన్నారు. కొవిడ్ మూలాలను తెలుసుకునేందుకు మరోసారి దర్యాప్తు జరపాలంటూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందంతో బహిరంగ లేఖ విడుదల చేస్తున్నామన్నారు.
WHO తీరుపై విమర్శలు..
కొవిడ్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ దర్యాప్తు బృందం నెల రోజుల పాటు చైనాలో పర్యటించింది. కానీ, దర్యాప్తు జరిపిన తీరుపై ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా అధికారులపైనే దర్యాప్తు బృందం పూర్తిగా ఆధారపడిందని.. సరైన ఆధారాలు, కీలక సమాచారం సేకరించడంలో విఫలమైందనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. వైరస్ను మొట్టమొదటి సారిగా గుర్తించిన ప్రదేశం వివరాలను ఇవ్వడానికి చైనా సుముఖంగా లేదని దర్యాప్తు బృంద సభ్యులు తొలుత వెల్లడించిన విషయాన్ని అంతర్జాతీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. వుహాన్లోని ల్యాబ్ నుంచి వైరస్ బయటపడే అవకాశమే లేదంటూ దర్యాప్తు బృందం సభ్యుడే కొట్టిపారేయడం ఎలాంటి అర్థం లేని వ్యాఖ్య అని ఫ్లిండర్స్ యూనివర్సిటీ నిపుణుడు పెట్రోవ్స్కై పేర్కొన్నారు. అలా కొట్టిపారేయడానికి కావాల్సిన ఎలాంటి శాస్త్రీయ సమాచారం దర్యాప్తు నివేదికలో కనిపించలేదని స్పష్టంచేశారు.
మరోసారి దర్యాప్తు చేయాల్సిందే..
కొవిడ్ మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్-2 వైరస్, తొలుత చైనాలోని వుహాన్లో బయటపడిందనే యావత్ ప్రపంచం భావించింది. ఈ మహమ్మారి మూలాలను శోధించాలని ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడితెచ్చాయి. తొలుత దీనికి ఒప్పుకోని చైనా, చివరకు అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిడితో దర్యాప్తునకు అంగీకరించింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ నిపుణులు బృందం వుహాన్లోని ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలను పరిశీలించి దర్యాప్తు జరిపింది. అయితే, కొవిడ్ మూలాలు వుహాన్లోనే తొలుత బయటపడ్డాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు బృందం ప్రకటించింది. ఇతర జంతువుల నుంచే సోకి ఉండవచ్చని అభిప్రాయపడినప్పటికీ వాటికి సంబంధించిన రుజువులను కనిపెట్టలేకపోయింది.
ఇలా మిస్టరీగా మారిన కొవిడ్ మూలాలపై గుట్టు విప్పేందుకు పరిశోధనలు కొనసాగించాలని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు జరిపినప్పటికీ కొవిడ్ మూలాలను ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదన్నారు. ఈ విషయాలను యావత్ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తున్నామని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ మూలాలపై చైనాలో జరిపిన దర్యాప్తు నివేదికపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్