Ukraine Crisis: ఉక్రెయిన్‌ నుంచి బెంగళూరుకు భారత విద్యార్థి భౌతికకాయం..

ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో రష్యా జరిపిన దాడిలో మరణించిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ భౌతికకాయం..

Updated : 21 Mar 2022 14:32 IST

బెంగళూరు: ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో రష్యా జరిపిన దాడిలో మరణించిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప భౌతికకాయం.. ఈ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న నవీన్.. మార్చి 1న ఖర్కివ్‌లో జరిగిన పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు విమానాశ్రయంలో అతడి పార్థివదేహానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై నివాళులు అర్పించారు. భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. రష్యా దాడిలో నవీన్ ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. నవీన్ మృతదేహాన్ని పరిశోధనల కోసం దేవనాగరెలోని వైద్య కళాశాలకు దానం చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని