Corona: చైనాలో.. అంతకుముందే కొవిడ్ వ్యాప్తి!
కరోనా వైరస్కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెడుతోందా? 2019 డిసెంబర్లో ఇది వెలుగు చూసినట్లు చెబుతున్నప్పటికీ.. అంతకుముందే చైనాలో వైరస్ వ్యాప్తి చెందిందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది.
బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం
లండన్: కరోనా వైరస్కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెడుతోందా? 2019 డిసెంబర్లో ఇది వెలుగు చూసినట్లు చెబుతున్నప్పటికీ.. అంతకుముందే చైనాలో వైరస్ వ్యాప్తి చెందిందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఇలాంటి అనుమానాలను ఇప్పటికే పలు అధ్యయనాలు వ్యక్తం చేయగా.. తాజాగా బ్రిటన్ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. చైనా పేర్కొన్నట్లుగా డిసెంబరులో కాకుండా అంతకు రెండునెలల ముందే వైరస్ వ్యాప్తి చెందినట్లు అంచనా వేస్తున్నారు. బ్రిటన్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయన ఫలితాలు ఓ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దీన్ని తెలుసుకునేందుకు ఓ వైపు అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో వాటి మూలాలను చైనా చెరిపేస్తున్నట్లు తేలింది. ఇదే సమయంలో కరోనా వైరస్ డిసెంబర్ 2019లో బయటపడిందని చైనా చెబుతున్నప్పటికీ.. అంతకు రెండు నెలలముందే, అంటే అక్టోబర్ నుంచే చైనాలో వైరస్ వ్యాప్తి చెందిందని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ కెంట్కు చెందిన డేవిడ్ రాబర్ట్ బృందం చేసిన అధ్యయనంలో తేలింది.
తొలికేసు నవంబర్ 17నే?
కరోనా వైరస్ వ్యాప్తి తొలుత ఎప్పుడు మొదలైందనే విషయం తెలుసుకునేందుకు డేవిడ్ రాబర్ట్ బృందం నడుం బిగించింది. ఇందుకోసం అంతరించిపోయే జాతుల జాడలను తెలుసుకునేందుకు రూపొందించిన ఓ గణిత నమూనాను పరిశోధకులు ఉపయోగించారు. వైరస్ కారకాలుగా భావిస్తోన్న జీవజాతుల వీక్షణల ఆధారంగా అంచనా వేశారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి నమోదైన కేసుల వివరాలను రివర్స్ నమూనా పద్ధతిలో విశ్లేషించారు. దీనిలో అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలోనే చైనాలో తొలికేసు నమోదైనట్లు గుర్తించారు. నవంబర్ 17న వుహాన్లో తొలికేసు వెలుగు చూసిందని.. జనవరి 2020 నాటికి ప్రపంచ దేశాలకు వ్యాపించిందనే అంచనాకు వచ్చారు.
తొలుత ఆ ఐదు దేశాల్లో!
కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా అధికారికంగా పేర్కొన్న దానికంటే.. అత్యధిక వేగంగా అది వ్యాప్తి చెందిందని బ్రిటన్ నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా చైనా తర్వాత తొలుత మరో ఐదు దేశాలకు 2020 జనవరిలోనే విస్తరించిందని అంచనా వేశారు. ముఖ్యంగా 2020 జనవరి 3న జపాన్లో తొలికేసు నమోదుకాగా, జనవరి 7న థాయిలాండ్లో తొలికేసు నమోదైనట్లు అంచనా వేశారు. ఇక జనవరి 12న స్పెయిన్లో తొలికేసు నమోదుకాగా.. దక్షిణ కొరియాలో జనవరి 14న వైరస్ వెలుగు చూసిందని అన్నారు. ఇలా అనతి కాలంలోనే ఆసియా మొత్తం వ్యాపించిన కరోనా వైరస్.. జనవరి 16న అమెరికాకు పాకిందని అంచనా వేశారు. ఈ సందర్భంగా కరోనా మూలాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. తదేకంగా కొనసాగుతోన్న వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి అవి ఎంతో దోహదం చేస్తాయని బ్రిటన్ పరిశోధకులు స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో సంభవించే అంటువ్యాధుల వ్యాప్తి క్రమాన్ని తెలుసుకునేందుకు తాజా అధ్యయన విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
చైనా కుటిల యత్నాలు నిజమే: ధ్రువీకరించిన అమెరికా
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు బలాన్నిచ్చే సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం. కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ చైనా యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. తొలినాళ్లలో కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్న మాట వాస్తవమేనని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.