ట్రంప్‌తో మాట్లాడిన మోదీ..!

భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు పటిష్ఠమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం......

Published : 07 Jan 2020 11:25 IST

దిల్లీ: భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు పటిష్ఠమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం చేసే దిశగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, అమెరికావాసులకు మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఫోన్‌ సంభాషణలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చ జరిగినట్లు తెలిపారు. 2019లో ఉభయ దేశాల మధ్య చోటుచేసుకున్న పురోగతి, 2020లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు. 

ఈ సందర్భంగా ట్రంప్‌ కూడా భారత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో భారత్‌ సుభిక్షంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గత కొన్నేళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని