అనురాగ్‌ ఠాకూర్‌ను కాపాడిన నిర్మలమ్మ

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు మీడియా సమావేశంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దీంతో విలేకరి అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పి ఠాకూర్‌ను రక్షించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Published : 27 Feb 2020 13:12 IST

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు మీడియా సమావేశంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దీంతో విలేకరి అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పి ఠాకూర్‌ను రక్షించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఇంతకీ ఏం జరిగిందంటే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆమె బృందం బుధవారం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి అనురాగ్‌ ఠాకూర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇటీవల దిల్లీ ఎన్నికల సమయంలో ఆయన చేసిన ‘గోలీ మారో’ వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్రంగా స్పందించడం పై సదరు విలేకరి ఠాకూర్‌ను ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేక కేంద్ర మంత్రి ఇబ్బందిపడ్డారు. 

ఈ వ్యవహారం గమనించిన నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. ‘మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. బ్యాంకర్లతో కలిసి మేం తీసుకున్న నిర్ణయాలను చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ స్పందించబోం’ అని అన్నారు. 

ఇటీవల దిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్‌ ఠాకూర్‌ సహా కొందరు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వీడియోలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీ అల్లర్ల కేసు విచారణ సందర్భంగా ఆ వీడియోలను ప్రదర్శించిన న్యాయస్థానం.. సదరు నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను నిలదీసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు