ఆ డ్రగ్పై ఆశలు ఆవిరి?
కొవిడ్-19 చికిత్సలో మెరుగైన ఫలితాలిస్తుందని ఇప్పటి వరకు భావించిన యాంటీవైరల్ డ్రగ్ ‘రెమ్డెసివిర్’ ప్రయోగ దశలోనే విఫలమైనట్లు సమాచారం.....
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 చికిత్సలో మెరుగైన ఫలితాలిస్తుందని ఇప్పటి వరకు భావించిన యాంటీవైరల్ డ్రగ్ ‘రెమ్డెసివిర్’ ప్రయోగ దశలోనే విఫలమైనట్లు సమాచారం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తమ అధికారిక వెబ్సైట్లో ఓ ముసాయిదా పత్రాన్ని అనుకోకుండా ఉంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. ఆ వివరాల ప్రకారం.. రెమ్డెసివిర్ కరోనా రోగులపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలుస్తోంది. అయితే, దీన్ని తయారు చేస్తున్న అమెరికా ఫార్మా కంపెనీ గిలీడ్ సైన్సెస్ మాత్రం ఈ వార్తల్ని తోసిపుచ్చింది. నివేదికను వక్రీకరించారని వాదిస్తోంది. ఈ ప్రయోగ ఫలితాలకు సంబంధించిన ముసాయిదా పత్రాన్ని డబ్ల్యూహెచ్ఓ వెంటనే వెబ్సైట్ నుంచి తొలగించడం గమనార్హం. అయితే, ఇది మెరుగైన ఫలితాలిస్తున్నట్లు గతంలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు భారత్లో ఐసీఎంఆర్ శాస్త్రవేత్త ఒకరు తెలపడంతో ఈ డ్రగ్పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
అధ్యయనం ఎలా జరిగింది..
చైనాలో వైరస్ సోకిన 237 మందిని ఈ అధ్యయనానికి తీసుకున్నారు. వీరిలో 158 మందిలో ‘రెమ్డెసివిర్’ ప్రయోగించారు. మిగతా 79 మందికి ఎలాంటి మందులు ఇవ్వకుండా ఉంచారు. అలా రోజూ రెండు బృందాల్లోని వ్యక్తుల ఆరోగ్యంలో సంభవించిన మార్పుల్ని గమనించారు. ఒక నెల తర్వాత పరిశీలిస్తే డ్రగ్ తీసుకున్నవారిలో 13.9శాతం మరణించారు. తీసుకోనివారిలో 12.8శాతం మృతి చెందారు. అలాగే డ్రగ్ తీసుకున్నవారిలో ‘సైడ్ ఎఫెక్ట్స్’ ఉండడంతో తొలిదశలోనే ప్రయోగాల్ని నిలిపివేశారు. చివరగా.. రెమ్డెసివిర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు.
గిలీడ్ సైన్సెస్ ఏమంటోందంటే..
డబ్ల్యూహెచ్ఓ చర్యతో గిలీడ్ సైన్సెస్ తీవ్రంగా విభేదించింది. అధ్యయనానికి సంబంధించిన ఫలితాల్ని ఆ నివేదిక తప్పుగా వెలిబుచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, దీని ప్రయోగానికి ఎక్కువ మంది రోగులు ముందుకు రాలేదని.. అందుకే పరీక్షల్ని తొలిదశలోనే నిలిపివేశామని తెలిపారు. తక్కువ మందిపై ప్రయోగించి ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు. అయితే, వైరస్ తొలిదశలో ఉన్నవారిలో ఆశాజనక ఫలితాలున్నట్లు మాత్రం సమాచారం ఉందన్నారు. దీంతో డ్రగ్ వాడకానికి సంబంధించిన ప్రయోగాలు ముగిసిపోలేదని.. ఇంకా పరీక్షలు కొనసాగుతాయన్నారు.
ఇవీ చదవండి..
వ్యాక్సిన్ పరీక్షకు అతిదగ్గరలో ఉన్నాం: ట్రంప్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.