బీజింగ్లో పరిస్థితి తీవ్రరూపం!
కరోనా వైరస్ మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్ను వణికించిన ఈ మహమ్మారి...
కరోనా తీవ్రరూపం దాల్చిందని అధికారుల హెచ్చరిక
నగరం నుంచి బయటకు వెళ్లడంపై నిషేధం
బీజింగ్: కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్ను వణికించిన ఈ మహమ్మారి తాజాగా దేశ రాజధాని బీజింగ్పై పడగవిప్పింది. నగరంలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ షిన్ఫడి తాజాగా వైరస్కు కేంద్ర బిందువైంది. నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో బీజింగ్లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్లు నగర అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాజధాని నగరంలో కేవలం మంగళవారం ఉదయమే కొత్తగా 27కేసులు బయటపడ్డాయి. నగరంలో గడిచిన ఐదు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 106కి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని 30ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించారు. నిత్యం వేల మంది సందర్శించే ఈ మార్కెట్ తాజాగా వైరస్ వ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది. దీంతో లక్షల సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పటికే పరీక్షలను ముమ్మరం చేశారు. రాజధానిలో పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అన్ని ఆహార కేంద్రాలు, రెస్టారెంట్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో పనిచేసే వారితోపాటు వాటి నిర్వాహకులకు వైద్యపరీక్షలు చేస్తున్నట్లు బీజింగ్ నగర అధికార ప్రతినిధి ఝూ హెజియన్ వెల్లడించారు. రానున్న రోజుల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇతర నగరాలకు రాకపోకలు నిషేధం..
తాజాగా ఈ మహమ్మారి వ్యాప్తికి బీజింగ్ కేంద్రబిందువుగా మారడంతో నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడంపై నిషేధం విధించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా టాక్సీలు, ఇతర వాహన సర్వీసులను నగరం బయటకు వెళ్లకుండా నిషేధించినట్లు అక్కడి రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, గత కొన్నిరోజులుగా బీజింగ్ను పర్యటించిన ఇతర నగరవాసులు హోం క్వారంటైన్లోనే ఉండాలని చైనా మొత్తం ప్రకటించారు. వీటికితోడు నగరంలోని క్రీడా మైదానాలు, వినోద ప్రాంతాలు మూసివేయాలని ఆదేశించారు.
మరిన్ని వైరస్ క్లస్టర్ల గుర్తింపు..
బీజింగ్ అతిపెద్ద హోల్సేల్ మార్కెట్కు రోజుకు వేల సంఖ్యలో వివిధ నగరాల నుంచి వస్తుంటారు. గడచిన 15రోజుల్లో దాదాపు 2లక్షల మంది ఈ మార్కెట్ను సందర్శించినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో నగరంలోని 11 మార్కెట్లను కూడా ఇప్పటికే మూసివేసిన అధికారులు, దాదాపు 276 వ్యవసాయ మార్కెట్లను శుద్ధిచేసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఆయా మార్కెట్లో పనిచేస్తోన్న పదివేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. తాజాగా ఈ మార్కెట్కు సంబంధం ఉన్న సమీప ప్రావిన్సుల్లో కూడా వైరస్ వ్యాప్తి మొదలైనట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ గుర్తించింది.
రోజుకు 90వేల పరీక్షల సామర్థ్యం..
దేశ రాజధానిలో తాజాగా బయటపడుతున్న కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వుహాన్లో దాదాపు కోటి మందికి పరీక్షలు చేపట్టిన అధికారులు, బీజింగ్లో కూడా ఇదే తరహా పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో రోజుకు 90వేల మందిని పరీక్షించే సామర్థ్యంతో సిద్ధంగా ఉన్నట్లు చైనా అధికార వార్తా ఏజెన్సీ వెల్లడించింది.
హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
తాజాగా బీజింగ్ పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అత్యధిక జనాభా, అధిక రాకపోకలు సాగించే నగరంలో తాజాగా క్లస్టర్లు ఏర్పడడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే, గతరెండు నెలల్లో ఒక్కకేసు కూడా నమోదుకాని నగరంలో ఒక్కసారిగా వైరస్ విజృంభణకు కారణాలను విశ్లేషించే పనిలో చైనా అధికారులు నిమగ్నమ్యయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా