US: పశ్చిమ అమెరికా భగభగ!
ఏసీలు సరిపోవటం లేదు... రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోయాయి... మున్సిపాలిటీ సరఫరా చేసే మంచినీరు తగ్గించేశారు... అమెరికాలో తాజా దృశ్యాలివి! వేసవికాలం ఆరంభంలోనే అమెరికాను ముఖ్యంగా పశ్చిమ అమెరికా..
ఠారెత్తిస్తున్న ఎండలు ..
వాషింగ్టన్: ఏసీలు సరిపోవటం లేదు... రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోయాయి... మున్సిపాలిటీ సరఫరా చేసే మంచినీరు తగ్గించేశారు... అమెరికాలో తాజా దృశ్యాలివి! వేసవికాలం ఆరంభంలోనే అమెరికాను ముఖ్యంగా పశ్చిమ అమెరికా రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాల్లో సుమారు 4 కోట్ల మంది ప్రజల్ని అమెరికా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అనవసరంగా బయటకు రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదో అనూహ్య పరిస్థితిగా పేర్కొంది. అంతేగాకుండా ఈసారి వేసవిలో అన్ని రికార్డులూ బద్దలయ్యేలా ఉన్నాయని అంచనా వేస్తోంది. సోమవారం ఫీనిక్స్లో 46 డిగ్రీల సెల్సియస్, సియాటిల్లాంటి చోట్ల 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం పోర్ట్లాండ్లో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1940 నుంచి ఇప్పటిదాకా ఇదే అత్యధిక రికార్డుగా చెబుతున్నారు. సియాటిల్లో గత వారాంతం ఉష్ణోగ్రతలు 1894 నాటి రికార్డులను బద్దలుగొట్టాయని చెబుతున్నారు. అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతిచోటా పాత రికార్డులు బద్దలవుతున్నాయి. కాలిఫోర్నియా పాల్స్ప్రింగ్స్లో 47 డిగ్రీల సెల్సియస్పైగా నమోదైంది.
కొవిడ్ నియంత్రణల సడలింపు
తాజా ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని వాషింగ్టన్లో కొవిడ్ నియంత్రణలను కూడా సడలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కూలింగ్ సెంటర్లలో ప్రజల్ని పూర్తిగా అనుమతించాలని నిర్ణయించారు. ఏసీ థియేటర్లు, షాపింగ్ మాల్లలో పూర్తిగా ప్రజల్ని అనుమతించనున్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్లలో కూడా! టెక్సాస్, కాలిఫోర్నియాల్లో... విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్లను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటంతో గ్రిడ్కు సమస్యలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను తగ్గిస్తున్నారు. కెనడాలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం బ్రిటిష్ కొలంబియాలో ఉష్ణోగ్రత 46.6 డిగ్రీల సెల్సియస్!
హీట్డోమ్ కారణం
పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల ఏర్పడే హీట్డోమ్ కారణంగా ఉష్ణోగ్రతలింతగా నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘‘పర్యావరణ మార్పుల కారణంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగటం ఇకమీదట మామూలవుతుంది. దీనికి అంతా అలవాటు పడాల్సిందే’’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో వాతావరణ నిపుణుడు డేనియల్ స్వెయిన్ వ్యాఖ్యానించారు. వచ్చే మూడు నెలల పాటు ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతాయని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM