రబ్రీదేవిని ప్రశ్నించిన సీబీఐ
రైల్వేశాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్నప్పుడు 2004-09 మధ్య కాలంలో రైల్వేలో పలువురికి గ్రూపు-డి ఉద్యోగాలిచ్చి, దానికి బదులుగా విలువైన స్థలాలను తీసుకునేవారన్న ఆరోపణలపై ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు.
రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో విచారణ
లాలూ ప్రసాద్కు సమన్లు జారీ
దిల్లీ/పట్నా: రైల్వేశాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్నప్పుడు 2004-09 మధ్య కాలంలో రైల్వేలో పలువురికి గ్రూపు-డి ఉద్యోగాలిచ్చి, దానికి బదులుగా విలువైన స్థలాలను తీసుకునేవారన్న ఆరోపణలపై ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. పట్నాలోని నివాసంలో ఆమెను ప్రశ్నించిన అనంతరం ఈ కుంభకోణానికి సంబంధించి లాలూకు కూడా సమన్లు జారీ చేశారు. ఎలాంటి సోదాలు, దాడులు జరపలేదనీ, రబ్రీదేవి సోమవారం అందుబాటులో ఉంటానని చెప్పడంతో నివాసానికి వెళ్లి ప్రశ్నించామని సీబీఐ తెలిపింది. లాలూకు ఇదే తరహా నోటీసులు ఇచ్చినట్లు చెప్పినా, ఏరోజు ప్రశ్నిస్తారనేది మాత్రం వెల్లడించలేదు.
నేడు లాలూ విచారణ
సీబీఐ వర్గాలు లాలూను మంగళవారం విచారించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం సింగపూర్లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న లాలూ ఇటీవలే అక్కడి నుంచి తిరిగి వచ్చారు. దిల్లీలో కుమార్తె మీసాభారతి నివాసంలో ఆయన్ని అధికారులు విచారిస్తారు. స్థలాల బదలాయింపునకు సంబంధించి మరికొన్ని పత్రాలను నిందితుల నుంచి రాబట్టడంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. సీబీఐ తన పని తాను చేస్తోందని, ‘నాటిన పంట దిగుబడి’నే లాలూ ఇప్పుడు పొందుతున్నారని భాజపా పేర్కొంది.
కేసు ఇదీ..
లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో పట్నా కేంద్రంగా ఉన్న రైల్వేజోన్కు చెందిన కొందరికి ముంబయి, కోల్కతా, జబల్పుర్, జైపుర్ వంటి జోన్లలో ఉద్యోగాలు ఇప్పించారని, దానికి బదులుగా అభ్యర్థులు తమ స్థలాలను లాలూ ప్రసాద్కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కారుచౌక ధరకు బదిలీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. పట్నాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.4.39 కోట్ల విలువ చేసే 1,05,292 చదరపు అడుగుల స్థలాన్ని ఐదు క్రయ ఒప్పందాలు, రెండు బహుమతి ఒప్పందాల ద్వారా లాలూ కుటుంబం సంపాదించిందని ఆ సంస్థ పేర్కొంది. గత ఏడాది అక్టోబరు 7న లాలూ, రబ్రీదేవిలపై, మరో 14 మందిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. దీని ఆధారంగా న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. మరిన్ని వివరాలు రాబట్టడానికి సీబీఐ వర్గాలు రబ్రీదేవి నివాసానికి వెళ్లాయి.
భాజపా రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలు చర్యల్ని చేపట్టడం బహిరంగ రహస్యమేనని లాలూప్రసాద్ విలేకరులతో వ్యాఖ్యానించారు. తలవంచకపోవడం వల్లనే లాలూ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్లో ఆరోపించారు. సీబీఐ రాక గురించి తెలుసుకున్న ఆర్జేడీ కార్యకర్తలు రబ్రీదేవి నివాసం వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడికి సమీపంలో నివసించే బిహార్ మంత్రి తేజ్ప్రతాప్ యాదవ్ వెంటనే సైకిల్ తొక్కుకుంటూ తల్లి నివాసానికి చేరుకున్నారు. భాజపాను, కేంద్రాన్ని తాము వ్యతిరేకిస్తున్నందువల్లనే సీబీఐ వర్గాలు తన తల్లి నివాసానికి వచ్చాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆరోపించారు.
విపక్షాల ఆగ్రహం
రాజ్యాంగ సంస్థల దుర్వినియోగంపై ప్రధాని మోదీకి పలువురు విపక్ష నేతలు లేఖ రాసిన మరుసటి రోజే సీబీఐ రంగంలో దిగడం రాజకీయంగా విమర్శలకు తెరతీసింది. కేంద్రం తీరుపై ఆర్జేడీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీకి రాసిన లేఖపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా సంతకం చేశారని, అందుకే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. సీబీఐ అధికారుల చర్య రబ్రీదేవిని అవమానించడమేనని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తేజస్వీ యాదవ్పై ఒత్తిడి తీసుకురావడానికే కేంద్రం సీబీఐ దాడులు చేయిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి