Lottery: స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు.

Updated : 04 Oct 2023 08:22 IST

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ(Lottery) టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు. అబోహర్‌ పట్టణానికి చెందిన రమేశ్‌, కుకీ అనే స్నేహితులు గత కొన్నేళ్లుగా కలిసి లాటరీ టికెట్లు కొంటున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.100 టికెట్లు రెండు సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి విడుదలైన లాటరీ ఫలితాల్లో.. అందులో ఓ టికెటుకు రూ.కోటిన్నర బహుమతి తగిలింది. సోమవారం ఘంటాఘర్‌ చౌరస్తాలోని జ్ఞాన్‌చంద్‌ లాటరీ విక్రయకేంద్రం వద్దకు ఈ మిత్రులిద్దరూ బ్యాండుమేళంతో వచ్చారు. బ్యాండు దరువుకు నృత్యం చేస్తూ మిఠాయిలు పంచి కోలాహలం సృష్టించారు. లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని రమేశ్‌, కుకీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని