ప్రచారం కోసమే కేజ్రీవాల్పై పిటిషన్
మద్యం కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ కేవలం ప్రచారాన్ని ఆశించి వేసినట్లు ఉందని, దానికిగానూ కోర్టు ఖర్చు రూపంలో భారీగా వడ్డించాలని దిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.
సీఎంగా తొలగించాలనడంపై దిల్లీ హైకోర్టు
పిటిషనర్కు భారీగా వడ్డించాలని వ్యాఖ్య
దిల్లీ: మద్యం కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ కేవలం ప్రచారాన్ని ఆశించి వేసినట్లు ఉందని, దానికిగానూ కోర్టు ఖర్చు రూపంలో భారీగా వడ్డించాలని దిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఇదివరకే ఈ అంశంపై రెండు పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ విచారించి, తీర్పు వెలువరించిన తర్వాత ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్కుమార్ మరో పిటిషన్ వేయడంపై జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తపరిచింది. అదే ధర్మాసనానికి తాజా పిటిషన్నూ బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. రాజ్యాంగం నిర్దేశించిన విధుల్ని నిర్వర్తించలేని పరిస్థితిలో సీఎం ఇప్పుడు ఉన్నారని, జైలు నుంచి ఆయన పనిచేయడం సాధ్యం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. ఏ అధికారం ప్రకారం ఆయన కొనసాగుతున్నారో ప్రశ్నించి, పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనిపై తాత్కాలిక సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది.
‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ ప్రచారం ప్రారంభం
‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ (ఓటుతో జైలుకు సమాధానం చెప్పండి)’ ప్రచారాన్ని ఆప్ ప్రారంభించింది. సందీప్ పాఠక్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ- పెద్ద కుట్రలో భాగంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారన్నారు. ఈ నియంతృత్వ పోకడకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని, ఓటేసే ముందు కేజ్రీవాల్ ముఖాన్ని గుర్తుచేసుకోవాలని కోరారు.
కేజ్రీవాల్ పీఏ సహా ఇద్దరిని ప్రశ్నించిన ఈడీ
కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్లకు సోమవారం ఈడీ మరోసారి సమన్లు ఇచ్చి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. మరో ముగ్గురు నేతలు అరెస్టు అవుతారంటూ ఆప్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దుర్గేశ్ పాఠక్ వారిలో ఒకరు కావడం గమనార్హం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆప్ పాల్గొనకుండా ఎలాగైనా అడ్డుకోవాలని భాజపా కుట్ర చేస్తోందని ఆతిశీ తాజాగా ఆరోపించారు. మొత్తం నేతలందరినీ జైల్లోకి పంపాలని చూస్తున్నారని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఆరోపించారు.
ఆప్ ఎంపీ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టులో సోమవారం ఊరట లభించలేదు. రాజ్యసభ సభ్యుడైన సింగ్ గుజరాత్లోని మెట్రోపాలిటన్ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. పరువునష్టం కేసులో తమకు జారీచేసిన సమన్లను కొట్టివేయాలంటూ సంజయ్ సింగ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. వారి అప్పీలును హైకోర్టు ఫిబ్రవరి 16న కొట్టివేసింది. మోదీ విద్యార్హతలను శంకిస్తూ కేజ్రీవాల్, సింగ్ చేసిన వ్యాఖ్యలపై మెట్రోపాలిటన్ కోర్టులో గుజరాత్ విశ్వవిద్యాలయం పరువునష్టం దావా వేయగా ఉభయులకూ సమన్లు జారీ అయ్యాయి. వాటిని కేజ్రీవాల్, సింగ్లు సెషన్స్ కోర్టులో సవాల్చేసినా ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
ఆప్ నేతలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన సొంత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
BJP: భాజపా ఎంపీ జయంత్ సిన్హా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో భాజపా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
భాజపా సీనియర్ నేత నోరుజారి ఇరకాటంలో పడ్డారు. తాను చేసిన పొరపాటుకు ప్రతిగా ఉపవాసం చేస్తానని చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుడమి గర్భాన ‘బొగ్గు’మన్న మంటలు!
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని ఖలారీ రేంజ్లో బొగ్గు గని నుంచి సోమవారం ఎగసిపడుతున్న అగ్నికీలలివి. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
దురుసు డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. -
చదవాల్సిన పుస్తకం!
మీకు విద్యారంగంపైన ఇష్టం ఉంటే మీరు ఈ పుస్తకం కచ్చితంగా చదవాల్సిందే. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు. -
‘ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’
వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఆప్నకు విదేశీ నిధులు అందాయి
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. -
విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) ఛాన్స్లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. -
దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది. -
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్