High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్‌.. వెల్లడించిన రైల్వే మంత్రి

ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్(High Speed Train) రానుంది. ఈ విషయాన్ని శనివారం రైల్వే మంత్రి వెల్లడించారు.

Updated : 23 Sep 2023 15:28 IST

(ప్రతీకాత్మక చిత్రం)

సనంద్‌: వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్‌ ట్రైన్‌(High Speed Train) అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌- సనంద్‌ (Ahmedabad to Sanand) మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని సనంద్‌లో సెమీకండక్టర్‌ కంపెనీ మైక్రాన్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఆ స్టేషన్‌లో వందే భారత్ రైళ్లు కూడా ఆగుతాయని చెప్పారు.

‘అహ్మదాబాద్‌-సనంద్‌ మధ్య ప్రపంచ స్థాయి రైలు ప్రారంభం కానుంది. వచ్చే ఆరునెలల్లో హైస్పీడ్‌ ట్రైన్‌ రానుంది’ అని రైల్వే మంత్రి తెలిపారు. అలాగే రానున్న సంవత్సరాల్లో సెమీ కండక్టర్ల డిమాండ్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్నారు. ఈ రంగంలో గుజరాత్‌ ముందువరుసలో నిలిచిందన్నారు. సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేస్తామని మైక్రాన్‌ సంస్థ ఈ జూన్‌లో ప్రకటించింది. ఇందుకోసం ఈ అమెరికన్ కంపెనీ రూ.22,140 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది.

కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, చెన్నై- విజయవాడ టికెట్‌ ధరలివే..!

ముంబయి నుంచి అహ్మదాబాద్‌ మధ్య చేపడుతున్న బుల్లెట్‌ రైలు కారిడార్‌ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అహ్మదాబాద్‌ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. జపాన్‌ సహకారంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. అయితే, మహారాష్ట్రలో భూసేకరణ ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్ట్‌ పనులు నెమ్మదించాయి. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్‌-సనంద్‌ మధ్య దీన్ని నడపనున్నారు. 2026లో ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో ఒకేసారి 9 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా వీటిని ప్రారంభించనున్నారు. దీంతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సంఖ్య 34కు చేరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని