Interpol: 19 ఏళ్ల హరియాణా గ్యాంగ్స్టర్పై.. ఇంటర్పోల్ రెడ్ నోటీస్..
భారత్ నుంచి పారిపోయిన ఓ 19 ఏళ్ల గ్యాంగ్స్టర్పై ఇంటర్పోల్ (Interpol) నిఘా పెట్టింది. అతడిని పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
(Photo: Interpol Website)
ఇంటర్నెట్ డెస్క్: హరియాణా (Haryana)కు చెందిన ఓ 19 ఏళ్ల గ్యాంగ్స్టర్ (Gangster)పై ఇంటర్పోల్ (Interpol) రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నేరపూరిత కుట్రలు, హత్యాయత్నం, నిషేధిత ఆయుధాలు, మందుగుండును ఉపయోగించడం వంటి అభియోగాలపై యోగేశ్ కడియన్ (Yogesh Kadian)పై ఈ నోటీసులు (red corner notice) ఇచ్చినట్లు తెలిపింది. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 1.5లక్షల రివార్డును కూడా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలు పొందుపర్చింది.
హరియాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన యోగేశ్ కడియన్ 17 ఏళ్ల వయసులోనే నకిలీ పాస్పోర్ట్తో అమెరికా పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం. ప్రస్తుతం యూఎస్లో బబిన్హా గ్యాంగ్ వద్ద పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అధునాతన సాంకేతికతో ఆయుధాలు తయారు చేయడంలో యోగేశ్ నిపుణుడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అతడికి ఖలిస్థానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయనే అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA).. హరియాణాలోని యోగేశ్ ఇల్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. తాజాగా అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
భారతీయులు ఆ దేశానికి వెళ్లాలంటే.. 1000 డాలర్ల ఫీజు కట్టాల్సిందే..!
స్వదేశం నుంచి పారిపోయి ఇతర దేశాల్లో నక్కిన నేరగాళ్లను పట్టుకునేందుకు ఇంటర్పోల్ ఇలా రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తుంది. దీంతో ఇంటర్పోల్ సభ్య దేశాలు ఆ నేరగాళ్లను తమ భూభాగంలో ఉంటే వారిని గుర్తించి.. అదుపులోకి తీసుకుంటారు. అంతకుముందు పలువురు గ్యాంగ్స్టర్లు, ఖలిస్థానీ ఉగ్రవాదులపై కూడా ఇంటర్పోల్ ఇలాంటి రెడ్ నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?