COVID-19 Subvariant JN.1: ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం: కొత్త ఉపరకంపై వైద్యులు
దేశంలో కొత్తగా వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పలువురు వైద్యులు తెలిపారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కొవిడ్-19 (Covid-19) కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు వెలుగుచూడటంతో ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో జేఎన్.1 వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆరోగ్య రంగ నిపుణులు, వైద్యులు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఈ ఉపరకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
‘‘సార్స్-కోవ్-2 వైరస్లో కొత్తగా వచ్చిన ఉపరకంతో ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఇన్ఫ్లూయెంజా వైరస్లు, శ్వాసకోశ సంబంధిత వైరస్లు తరచుగా రూపాంతరం చెందుతుంటాయి. భారత్లోని ప్రజలు ఇప్పటికే కరోనా ఉపరకం వైరస్లను ఎదుర్కొన్నారు. చాలా మంది రెండు డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకున్నారు. కాబట్టి, కొత్తగా వెలుగు చూసిన ఉపరకంతో ఆందోళన చెందాల్సిన రీతిలో ముప్పు ఉండదు. కానీ అప్రమత్తత అవసరం’’ అని సీనియర్ ప్రజారోగ్య వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహారియా తెలిపారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్డీసీ ఔషధాలు వాడొద్దు: కేంద్రం
‘‘జేఎన్.1 ఉపరకం.. ఒమిక్రాన్ వేరియంట్లోని బీఏ.2.8.6 శాఖకు చెందినది. ఇది మనిషి రోగనిరోధక వ్యవస్థను అధిగమిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, ఇప్పటి వరకు జేఎన్.1 సోకిన వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ఎలాంటి సమాచారం లేదు. దీని గురించి ఆందోళన అవసరంలేదు’’ అని హైదరాబాద్కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ కార్తిక్ వేదుల తెలిపారు.
కొత్త ఉపరకానికి చెందిన ప్రధాన వేరియంట్లో 35 అమినో యాసిడ్ పరివర్తనాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక దాని సాయంతో వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వైరాలజి ప్రొఫెసర్ దీపక్ సెహగల్ వెల్లడించారు. ‘‘జేఎన్.1 ఉపరకం ప్రభావం అధికంగా ఉంటుందనేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలులేవు. గత వైరస్ల లక్షణాలే ఇందులోనూ ఉన్నాయి. కాబట్టి, ఆందోళన చెందకుండా ప్రజారోగ్య వ్యవస్థను, ప్రజలను అప్రమత్తం చేసి, స్వీయ నిబంధనలు పాటిస్తే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.