కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదికి.. లష్కరేతో సంబంధాలు..?
కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్దీప్ దల్లాకు లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధాలున్నట్లు దిల్లీ పోలీసులు గుర్తించారట. ఈ మేరకు వారు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ అంశంతో భారత్, కెనడా (India Canada Diplomatic Row) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్దీప్ దల్లాకు లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లో ఉన్న హిందూ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపాలని అర్ష్దీప్ కుట్రలు పన్నుతున్నాడని దిల్లీ పోలీసులు (Delhi Police) గుర్తించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల కోసం దిల్లీ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో దిల్లీలోని జహంగిర్పురిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. అనంతరం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయని పోలీసులు ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అరెస్టయిన అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకడు.. తాను అర్ష్దీప్ దల్లాతో టచ్లో ఉన్నట్లు అంగీకరించాడట. పంజాబ్లో ఉగ్ర కార్యకలాపాలకు సిద్ధమవ్వాలని దల్లా.. తనకు సూచించాడని విచారణలో చెప్పినట్లు పోలీసులు తమ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు.
‘ఆరోపణలు నిజమని తేలితే..’: భారత్తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
లష్కరే ముఠాకు చెందిన సుహైల్ అనే ఉగ్రవాదితో అర్ష్దీప్ దల్లాకు సన్నిహిత సంబంధాలున్నాయని ఈ దర్యాప్తులో దిల్లీ పోలీసులు గుర్తించారు. సుహైల్, దల్లా ఆదేశాల మేరకే.. దిల్లీలో తాను ఓ హిందూ బాలుడిని హత్య చేసినట్లు సదరు అనుమానిత ఉగ్రవాది పోలీసుల ముందు అంగీకరించాడని సమాచారం. పంజాబ్లో కల్లోలం సృష్టించేందుకు తమకు సుహైల్, దల్లా నుంచి ఆయుధాలు అందుతున్నాయని అతడు చెప్పినట్లు పోలీసులు తమ ఛార్జ్షీట్లో వెల్లడించారు.
ఎవరీ అర్ష్దీప్ దల్లా?
27 ఏళ్ల దల్లా స్వస్థలం పంజాబ్లోని మోఘా జిల్లా. భారత్లో అతడిపై కనీసం 25 కేసులున్నాయి. 2020 జులైలో అతడు కెనడా పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం. కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ మద్దతుదారుల్లో దల్లా కూడా ఒకడని భారత నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్కు ఇతడు సన్నిహితుడని తెలుస్తోంది. అయితే నిజ్జర్ కంటే కూడా దల్లాపైనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఇక, దల్లా గ్యాంగ్కు చెందిన మరో గ్యాంగ్స్టర్ సుఖ్దోల్ సింగ్ గతవారం కెనడాలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు