Pandemic Wedding: గూగుల్ మీట్లో పెళ్లంట.. జొమాటోలో విందంట..!
పెళ్లంటేనే.. ఆకాశమంత పందిళ్లు.. చుట్టాల సందళ్లు.. విందు భోజనాలు..! ఇదంతా రెండేళ్ల క్రితం వరకు ఉన్న మాట. కరోనా పుణ్యమా అని ఇప్పుడు పెళ్లిళ్లలో నయా ట్రెండ్ మొదలైంది.
ఇంటర్నెట్డెస్క్: పెళ్లంటే.. ఆకాశమంత పందిళ్లు.. చుట్టాల సందళ్లు.. విందు భోజనాలు..! ఇదంతా రెండేళ్ల క్రితం వరకు ఉన్న మాట. కరోనా పుణ్యమాని ఇప్పుడు పెళ్లిళ్లలో నయా ట్రెండ్ మొదలైంది. అదే ‘ఆన్లైన్ వెడ్డింగ్’. మహమ్మారి భయాందోళనలు, కరోనా ఆంక్షల నేపథ్యంలో గతేడాది కొంత మంది వధూవరులు జూమ్ కాల్లోనే పెళ్లిపీటలెక్కడం లేదా.. తమ పెళ్లిని ఆన్లైన్ లైవ్లో ప్రసారం చేయడం వంటివి చేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ జంట మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్ వేదికగా 450 మంది అతిథులతో పెళ్లి వేడుకలకు సిద్ధమవుతోంది. అంతేనా.. ఆ అతిథులకు ‘జొమాటో’తో విందు కూడా ఇవ్వనుంది..!
పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ ప్రాంతానికి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్.. ఏడాది కాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే కరోనా ఆంక్షల కారణంగా పలుమార్లు వీరు తమ వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు ఈ ఏడాది జనవరి 24న పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ లోగానే ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వరుడు సందీపన్ కొవిడ్ బారినపడ్డారు. మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి కోలుకున్నారు. మరోవైపు వైరస్ ఉద్ధృతితో బెంగాల్ ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించింది. వివాహాది శుభకార్యాల్లో అతిథులపై పరిమితి విధించింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో బంధువులందర్నీ పిలిచి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాని పని. అలా అని మళ్లీ వివాహ తేదీని వాయిదా వేయలేని పరిస్థితి.
ఆ సమయంలోనే తమకు ఈ ఆన్లైన్ వెడ్డింగ్ ఆలోచన వచ్చిందని సందీపన్ తెలిపారు. ‘‘జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు కరోనా కారణంగా నేను ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అప్పుడే నా కుటుంబం, మా పెళ్లికి వచ్చే అతిథుల గురించి ఆందోళన మొదలైంది. అందుకే, అందర్నీ పిలిచి కాకుండా మరో విధంగా పెళ్లి చేసుకోవాలని నేను నిశ్చయించుకున్నా. ఇదే విషయాన్ని అదితికి చెబితే తను కూడా అర్థం చేసుకుంది. అలా ఈ నెల 24న మేం ఆన్లైన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు, బంధువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గూగుల్ మీట్లో మా పెళ్లి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని సందీపన్ చెప్పారు. ఇందుకోసం వీరు ఓ సాంకేతిక నిపుణుడిగా కూడా నియమించుకున్నారట. పెళ్లి తేదీకి ఒక రోజు ముందు అతిథులందరికీ గూగుల్ మీట్లో ఓ లైవ్ లింక్, పాస్వర్డ్ను పంపించనున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసి.. బంధువులు తమ ఇళ్లల్లోనే ఉండి సురక్షితంగా వివాహాన్ని చూడొచ్చని సందీపన్ తెలిపారు.
అంతే కాదండోయ్.. మరి పెళ్లికి హాజరైన వాందరికీ విందు భోజనాలు పెట్టాలి కదా. దీనికీ ఈ జంట ఓ ఉపాయాన్ని ఆలోచించింది. జొమాటో యాప్ ద్వారా అతిథులందరికీ డిన్నర్ డెలివరీ చేసే ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై జొమాటో అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా వినూత్న ఆలోచన. ఇందుకోసం మేం ప్రత్యేకంగా ఓ బృందాన్ని కూడా నియమించాం. ఈ మహమ్మారి సమయంలో ఇలాంటి ఆలోచన చాలా బాగుంది. దీన్ని మా సోషల్మీడియాల్లోనూ ప్రచారం చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.
కరోనా దెబ్బకు ఈ మధ్య చాలా మంది ఇలాంటి వినూత్న వివాహ వేడుకలకే మొగ్గుచూపుతున్నారు. ఇటీవలే తమిళనాడుకు చెందిన ఓ జంట తమ వివాహ రిసెప్షన్ను మెటావర్స్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగే ఈ వేడుకకు బంధువులంతా డిజిటల్ అవతార్లో వర్చువల్గా రిసెప్షన్కు హాజరవుతారని వరుడు దినేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.