Modi: యువ భారత్ దారి చూపుతోంది: మోదీ
కరోనా కట్టడిలో భాగంగా 15-18 ఏళ్ల వయసు వారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో ఆ వయసు గ్రూపులో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే
దిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా 15-18 ఏళ్ల వయసు వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యాక్సినేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో ఆ వయసు గ్రూప్లో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వార్త అని అన్నారు.
‘‘యువ భారత్ వ్యాక్సినేషన్లో ఓ దారిని చూపిస్తోంది. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వార్త. దీన్ని ఇలాగే కొనసాగించాలి. అందరూ వ్యాక్సిన్ వేసుకొని, కొవిడ్ నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. మనమంతా ఏకమై ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలి’’ అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యం స్ఫూర్తిదాయకం
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) రైజింగ్ డే సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్యసాహసాలు, వృత్తిపై చూపే అంకితభావం స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. విపత్తు నిర్వహణ అనేది ప్రభుత్వానికి, పాలకులకు ఎంతో ముఖ్యమైన అంశమని చెప్పారు. అందుకే, ఎన్డీఆర్ఎఫ్ బృందాల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా విపత్తు సమయాల్లో వీలైనన్ని ఎక్కువ ప్రాణాలను, ఆస్తులను కాపాడగలమని మోదీ చెప్పారు.
స్ఫూర్తినింపే జీవతగాథలను మాకు చెప్పండి..
ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల 30న జరగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ కార్యక్రమంలో భాగం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు వారికి తెలిసిన స్ఫూర్తిదాయక జీవితగాథలను తనకు తెలియజేయాలని కోరారు.
‘‘2022లో మొదటి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల 30న జరగనుంది. నాతో పంచుకోవడానికి మీ వద్ద ఎన్నో స్ఫూర్తిదాయకమైన జీవిత కథలు, అంశాలు ఉన్నాయని భావిస్తున్నాను. వాటిని మీరు @mygovindia లేదా NaMo యాప్ ద్వారా పంచుకోండి. 1800-11-7800 నంబర్కి కాల్ చేసి కూడా మీ సందేశాన్ని రికార్డ్ చేయొచ్చు" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.