Israel: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్
ఇజ్రాయెల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్ను ఎన్నుకుంది. 120 మంది సభ్యులు గల నెసెట్లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60
జెరుసలెం: ఇజ్రాయెల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్ను ఎన్నుకుంది. 120 మంది సభ్యులు గల నెసెట్లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60 మంది, వ్యతిరేకంగా 59 మంది ఓటు వేశారు. దీంతో నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రధానిగా నియమితులైన నఫ్తాలీ బెన్నెట్ మరో రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో 8 పార్టీలు ఉన్నాయి. వీటిలో ఓ అరబ్ పార్టీ కూడా ఉంది. ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఓ అరబ్ పార్టీ ప్రభుత్వంలో చేరడం గమనార్హం.
120 మంది సభ్యులుగా పార్లమెంట్ నెస్సెట్కు గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లిక్డ్ పార్టీ మరోపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని పదవిని ఇరు పార్టీలు పంచుకోవాలని అప్పుడు నిర్ణయించుకున్నారు.
మిలియనీర్గా..
ఇజ్రాయెల్కు నూతన ప్రధానిగా నియమితులైన 49 ఏళ్ల నఫ్తాలీ బెన్నెట్ దేశంలో ప్రముఖ మిలియనీర్గా పేరు పొందారు. బెన్నెట్ తల్లిదండ్రులు అమెరికా నుంచి ఇజ్రాయెల్కు వలస వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు బెన్నెట్ ఓ టెక్ కంపెనీ ఎంటర్ప్రెన్యూర్గా పేరు గడించించారు. మతపరమైన జాతీయవాదిగా రాజకీయాల్లో తనపై ముద్ర ఉంది. 2013లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో బెన్నెట్ రక్షణ, విద్య, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.
ప్రధానిగా సదీర్ఘకాలంగా..
ఇక ఇజ్రాయెల్కకు నెతన్యాహు 12 ఏళ్ల నుంచి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. 1996-99 మధ్య తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఈ పదవిలో కొనసాగారు.
కొత్త ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు అభినందనలు..
ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నియమితులైన బెన్నెట్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభినందనలు తెలిపారు. భద్రత, స్థిరత్వం, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి బెన్నెట్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్కు అమెరికాను మించిన గొప్ప మిత్రుడు లేడని బైడెన్ అన్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య మంచి బంధం ఉందని, దీన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
ఎయిరిండియా (Air India Express)లో కొందరు క్యాబిన్ సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. -
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..? -
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్ అభివర్ణించింది. -
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం