కరోనా పరిచయం చేయనున్న కొత్త కాన్సెప్ట్!
మహమ్మారి మాయతో 2020లో మన జీవన విధానమే మారిపోయింది. మన నిత్యావసర సరకుల జాబితాలో క్రిమిసంహారిణులు, మాస్కులు, చేతి తొడుగులు, శానిటైజర్లు చేరిపోయాయి. రోగనిరోధకత పెంచే ఆహారం తీసుకోవడం......
ఇంటర్నెట్ డెస్క్: మహమ్మారి మాయతో 2020లో మన జీవన విధానమే మారిపోయింది. మన నిత్యావసర సరకుల జాబితాలో క్రిమిసంహారిణులు, మాస్కులు, చేతి తొడుగులు, శానిటైజర్లు చేరిపోయాయి. రోగనిరోధకత పెంచే ఆహారం తీసుకోవడం, ఇతరులకు దూరంగా ఉండడం అలవాటైపోయింది. ఈ క్రమంలో మహమ్మారి మనకు మరో కొత్త కాన్సెప్ట్లను పరిచయం చేస్తోంది. వాటిలో వ్యాక్సిన్ పాస్పోర్ట్ కూడా ఒకటి. అవును.. విదేశాలకు వెళ్లేటప్పుడు మనకు పాస్పోర్ట్ ఎలా తప్పనిసరో.. భవిష్యత్తులో వ్యాక్సిన్ పాస్పోర్ట్ కూడా కచ్చితం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ పాస్పోర్ట్ అంటే.. మనం కరోనా టీకా తీసుకున్నామని ధ్రువపత్రం అన్నమాట. లేదా మనం కొవిడ్తో బాధపడడం లేదని నిరూపించుకోవడం. అయితే.. ఇది ఓ యాప్ రూపంలో రానుండడం విశేషం.
థియేటర్లు, షాపింగ్ మాళ్లు, వివాహాది శుభకార్యాలు, కార్యాలయాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఇలా ఎక్కడికి వెళ్లినా.. థర్మల్ స్ర్కీనింగ్ తప్పనిసరైంది. కొవిడ్ సోకిన వారిలో జ్వరం ఓ లక్షణం కావడంతో ఇది వెంటనే పసిగడుతుందని ఈ పద్ధతిని తప్పనిసరి చేశారు. ఇక ఇప్పుడు టెస్టింగ్ బాగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో పరీక్షా ఫలితాలను కూడా చూపించాల్సి రావొచ్చు. దీనికి ప్రత్యేకంగా మనం ఎలాంటి డాక్యుమెంట్లు, ధ్రువపత్రాలు అవసరం లేకుండా అందరికీ ఆమోదనీయమైన యాప్లు పుట్టుకొస్తున్నాయి. వీటినే వ్యాక్సిన్ పాస్పోర్టులుగా వ్యవహరిస్తున్నారు.
ఎలా పనిచేస్తుందంటే...
* వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని కంపెనీలు యాప్ను రూపొందించాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని.. అందులో మన కరోనా నిర్ధారణ పరీక్షా ఫలితాలు లేదా టీకా వేయించుకున్న వివరాలు నమోదు చేయాలి. ఎప్పుడైనా కరోనా నిర్ధారణ వివరాల గురించి అడిగినప్పుడు ఈ వివరాలను ఆధారాలుగా చూపిస్తే సరిపోతుంది.
* ‘కామన్ పాస్’ (Common Pass) అనే యాప్ ఈ కోవకు చెందినదే. కామన్ ట్రస్ట్ నెట్వర్క్ అనే సంస్థ రూపొందించిన ఈ యాప్లో కొవిడ్-19 పరీక్ష ఫలితం, వ్యాక్సినేషన్ ఆధారాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదుచేసుకోవచ్చు. వాటిని యాప్ ధ్రువీకిరంచుకున్న వెంటనే ఓ క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ వస్తుంది. ఇక దీన్ని అవసరమైన చోట చూపిస్తే సరిపోతుంది.
* ఐబీఎం సైతం ‘డిజిటల్ హెల్త్ పాస్’ (Digital Health Pass) పేరుతో ఓ యాప్ను పరిచయం చేసింది. ఈ యాప్తో మన కొవిడ్ వ్యాక్సినేషన్, కరోనా పరీక్షా ఫలితాలకు సంబంధించిన వివరాల్ని ఇతర వ్యక్తులు లేదా సంస్థలు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.
* వ్యాక్సిన్ పాస్పోర్ట్లుగా వ్యవహరిస్తున్న ఈ యాప్లలోని ఆధారాలను పరిగణించి థియేటర్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలతో సహా విదేశీయులను సైతం అనుమతించే అవకాశం కల్పించాలని ఇప్పటికే పలు సంస్థలు ఆయా దేశ ప్రభుత్వాలతో పాటు డబ్ల్యూహెచ్వోకు దరఖాస్తు చేసుకున్నాయి. చూడాలి మరి ఈ కాన్సెప్ట్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?