Narendra Modi: ఏరోజూ ప్రధాని అవుతానని ఊహించలేదు!
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో నేడు మరుపురాని రోజు. రాజ్యాంగ పదవి స్వీకరించి నేటికి సరిగ్గా 20ఏళ్లు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్ 7వ తేదీన ఆయన తొలిసారి
గుజరాత్ సీఎం పీఠాన్ని అధిరోహించి నేటితో 20ఏళ్లు
13ఏళ్లు గుజరాత్కు, ఏడేళ్లుగా దేశానికి మోదీ సేవలు
దిల్లీ: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో నేడు మరుపురాని రోజు. రాజ్యాంగ పదవి స్వీకరించి నేటికి సరిగ్గా 20ఏళ్లు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్ 7వ తేదీన ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏకధాటిగా 13ఏళ్లు సీఎంగా ఆ రాష్ర్టానికి సేవలందిందించారు. 2014లో ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రూపురేఖలు మారాయి. నేడు ఉత్తరాఖండ్లోని ఎయిమ్స్ రిషికేశ్లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రజాజీవిత విశేషాలను పంచుకున్నారు.
‘‘ రెండు దశాబ్దాల క్రితం నా ప్రజా జీవన ప్రయాణం ప్రారంభమైంది. కానీ, నా జీవితంలో ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అవుతానని మాత్రం ఊహించలేదు. ప్రజల ఆశీర్వాదంతో 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికయ్యా. ఈ రోజు రిషికేష్లో నా 21వ సంవత్సరం ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను’’ అన్నారు.
తక్కువ సమయంలోనే నిరూపించాము..
కరోనా వేళ.. మన పనితీరు దేశ సామర్థ్యానికి నిదర్శనం. తక్కువ వ్యవధిలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చాం. ప్రారంభంలో కేవలం ఒకే టెస్టింగ్ ల్యాబ్ ఉండేది... అలాంటిది ప్రస్తుతం ఆ సంఖ్య 3000 టెస్టింగ్ ల్యాబ్స్కు పెరిగింది. మాస్కులు, పీపీఈ కిట్స్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. వాటిని ఎగుమతి చేసే స్థాయి మనం చేరుకొన్నాము. అంతేకాదు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత భారీ స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి నిర్మించిందే కొవిన్ ప్లాట్ఫామ్. అదే ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించింది.
35 ప్లాంట్లు.. 35 ప్రాంతాలకు..
ఉత్తరాఖండ్లోని ఎయిమ్స్ రిషికేశ్ లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ పీఎం కేర్స్తో నిర్మించిన 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్స్ను దేశంలోని 35రాష్ర్టాలు, కేంద్రపరిపాలిత ప్రాంతాలకు అంకితమిచ్చారు. అదేసమయంలో వీటన్నిటినీ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్