WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
పెద్దఎత్తున ఫాలోవర్లతో ట్విటర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చురుగ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వాట్సాప్ ఛానెల్లోనూ తన హవా కొనసాగిస్తున్నారు.
దిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇటీవలే ఛానెల్ (WhatsApp Channel) పేరుతో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. రాజకీయనాయకుల నుంచి సెలబ్రిటీల వరకు, వ్యాపార సంస్థల నుంచి ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ వరకు ప్రతి ఒక్కరు తమకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్తో ఛానెల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పరిచయం చేసిన కొద్ది రోజుల్లోనే దీన్ని ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాని మోదీ (PM Modi) కూడా ఇటీవలే వాట్సాప్ ఛానెల్లో ఖాతాను ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే ఆయన్ను 50 లక్షల మంది అనుసరించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక మెసేజ్ను పోస్ట్ చేశారు.
‘‘వాట్సాప్ ఛానెల్తో మీరంతా నాతో అనుసంధానమైనందుకు ఎంతో గొప్పగా భావిస్తున్నాను. నిరంతరం మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. ఈ మాధ్యమం ద్వారా మన సంభాషణలు కొనసాగిస్తుందన్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం’’ అని ప్రధాని మోదీ వాట్సాప్ ఛానెల్లో మెసేజ్ను పోస్ట్ చేశారు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు సైతం వాట్సాప్ ఛానెల్లో ఖాతాలను ప్రారంభించారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ను 1.3 కోట్ల మంది అనుసరిస్తుండగా, 60 లక్షల మంది ఫాలోవర్లతో అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ను 80 లక్షల మంది, స్టార్స్ స్పోర్ట్స్ను 50 లక్షల మంది అనుసరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
ప్రజ్వల్పై ఆరోపణలకు సంబంధించిన వీడియోలను ఎవరు లీక్ చేశారనే చర్చ నడుస్తోన్న నేపథ్యంలో ప్రజ్వల్ మాజీ డ్రైవర్ కార్తిక్, భాజపా నేత దేవరాజేగౌడలు.. నువ్వంటే నువ్వే లీక్ చేశావని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. -
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
ఎన్నికల ముందే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడంపై ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా నకిలీ వీడియోల కేసులో కాంగ్రెస్ నేత పీఏ, ఆమ్ఆద్మీ పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. -
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
తిహాడ్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలిశారు. -
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
Patanjali Row: పతంజలి ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ అధికారులు ఇప్పటికి నిద్ర లేచారని పెదవి విరిచింది. -
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
కర్ణాటక రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోలపై దుమారం రేగడంతో.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై వేటుపడింది. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 9 మంది మావోయిస్టులు హతం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. -
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
నకిలీ వీడియో ఘటనపై భాజపా అగ్రనేత అమిత్ షా (Amit Shah).. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ఆ పార్టీ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. -
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)పై జరిగిన హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ హస్తం ఉందంటూ యూఎస్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. -
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: వెనుక నుంచి దాడి చేయడంపై తనకు నమ్మకం లేదని ప్రధాని మోదీ అన్నారు. బాలాకోట్పై దాడుల అనంతరం ముందుగా పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే యావత్ ప్రపంచానికి తెలియజేశామన్నారు. -
అలోక్ శుక్లాకు ప్రతిష్ఠాత్మక గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్
‘ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి’ కన్వీనర్ అలోక్ శుక్లా ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్’ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్లా గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. -
ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. -
బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
తన అరెస్టు, కస్టడీని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘శాస్త్ర’లో యూనివర్సిటీ డే వేడుకలు
ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ డాక్టర్ అభయ్ జెరె సూచించారు. -
ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?
ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. -
పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు
పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్కు లేఖ రాసింది. -
భోజ్శాల సర్వేకు మరో 8వారాల గడువు
భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. -
ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ
దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. -
యూజీసీ నెట్ తేదీలో మార్పు
యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. -
ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్