PM Modi: కజిరంగ నేషనల్ పార్క్లో.. ఏనుగుపై మోదీ సఫారీ
PM Modi: ప్రధాని మోదీ తొలిసారిగా అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా అభయారణ్యంలో ఏనుగుపై సఫారీ చేశారు.
కజిరంగ: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) శనివారం అస్సాం (Assam)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ (Kaziranga National Park)ను ఆయన సందర్శించారు. అక్కడ ఏనుగు ఎక్కి (elephant safari) సఫారీ చేశారు. 1957 తర్వాత ఈ పార్క్ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం.
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోదీ అస్సాంలోని తేజ్పుర్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్లో గోలాఘాట్ జిల్లాలోని కజిరంగకు వచ్చారు. నిన్న రాత్రి జాతీయ పార్క్లోనే సేదతీరిన ఆయన.. ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్ కొహోరా రేంజ్ను సందర్శించారు. తొలుత ఏనుగు ఎక్కి విహరించిన ప్రధాని.. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు.
మోదీ వెంట పార్క్ డైరెక్టర్ సొనాలీ ఘోష్, అటవీశాఖ సీనియర్ అధికారులున్నారు. సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు. ఈ సందర్భంగా మహిళా ఫారెస్ట్ గార్డ్లతో ప్రధాని ముచ్చటించారు. ఈ చిత్రాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్ పార్క్ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.
‘భవిష్యత్తును ఊహించగలను’: జాతీయ పురస్కారాల ప్రదానంలో ప్రధాని మోదీ
పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం జోర్హట్లో కమాండర్ లచిత్ బర్ఫుకాన్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. శౌర్యానికి ప్రతీకగా 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇక, రూ.18వేల కోట్ల విలువ కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు