Rahul Gandhi: అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేపడతాం : రాహుల్‌

బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ధరలు చెల్లించడం కారణంగా ప్రజలపై విద్యుత్తు భారం పడుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.

Updated : 18 Oct 2023 16:57 IST

దిల్లీ: బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లతో ప్రజలు విద్యుత్తుకు ఎక్కువ చెల్లించేలా చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజలపై రూ.కోట్ల భారం పడుతోందని మీడియాలో వచ్చిన కథనాన్ని ఆయన ఉదహరించారు. దీనిపై దర్యాప్తునకు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై (Adani Group) దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు.

‘ఇండోనేషియా నుంచి అదానీ గ్రూప్‌ బొగ్గు దిగుమతి చేసుకొంది. భారత్‌కు చేరేసరికి దాని ధర రెట్టింపు అవుతోంది. ఇలా అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు విద్యుత్‌ బిల్లులను భారీగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొన్ని కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాలు పేదలకు సబ్సిడీలు చెల్లించాల్సి వస్తోంది’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య.. 15ఏళ్ల తర్వాత కీలక తీర్పు

ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దీనిపై దర్యాప్తు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాహుల్‌.. ‘తాము అధికారంలోకి వస్తే తప్పకుండా దర్యాప్తునకు ఆదేశిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నరని ప్రశ్నించిన రాహుల్‌.. దర్యాప్తు జరిపి వారి విశ్వసనీయతను నిరూపించుకోవాలని అడుగుతున్నానన్నారు. మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ధరకు అదానీ గ్రూప్‌ బొగ్గు దిగుమతి చేసుకున్నట్లు కనిపిస్తోందంటూ ఫైనాన్షియల్ టైమ్స్‌ కథనాన్ని రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని