అంబానీ నివాసంలో పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు
Ganesh Chaturthi Celebrations: గణేశ్ చతుర్థి వేడుకలు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసంలో వైభవంగా జరిగాయి.
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) నివాసంలో వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకలు వైభవంగా జరిగాయి. ముంబయి (Mumbai)లోని తన నివాస భవనం ఆంటిలియా(Antilia)లో వినాయక మండపాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. పర్యావరణహితంగా.. భారతీయత ఉట్టిపడేలా అలంకరించిన ఈ మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. పీపుల్, ప్లానెట్, పర్పస్ అనే అంశాలను మూడు స్తంభాలుగా చేసుకొని ఈ అలంకరణ చేపట్టారు. పండగ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంబానీ నివాసానికి రావడంతో సందడి నెలకొంది.
మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో..
‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తిని చాటడమే లక్ష్యంగా గణేశ్ మండపాన్ని తీర్చిదిద్దారు. గణేశ్ మండపం అలంకరణలో మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటారు. ఈ మండపం మధ్యలో పైథాని కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. పైథాని అనేది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని పైథాన్ నగరం నుంచి ఉద్భవించిన ఓ కళారూపం. ఇది తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. లఖ్నవూలోని జిర్దోజీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నుంచి ఒడిశాలో చేతితో తయారు చేసే పేపర్ మాచే వరకు మొత్తం భారతీయ హస్తకళలతో మండపం కనువిందు చేస్తోంది.
సాధికారత, జీవనోపాధి కల్పన..
కళాకారులకు జీవనోపాధితో పాటు సాధికారత కల్పించడమే లక్ష్యంగా విఘ్నేశ్వరుడి ఊరేగింపు కోసం దాదాపు 700 మందికి పైగా మహిళలు తమ స్వహస్తాలతో రూపొందించిన వివిధ రకాలైన బొమ్మలను ఉంచారు. వీటి తయారీలో వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలను ఎంపిక చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించారు. ఏటా వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక కళాకారుల జీవితాల్లోనూ ఆనందం కలిగిస్తుందని రిలయన్స్ పేర్కొంది. 400 మందికి పైగా కళాకారులు పురాతన పుష్పాలను అతికించే పద్ధతులను ఉపయోగించి గణేశుడి విగ్రహం వెనుక పూల గోడను ఎంతో అద్భుతంగా అలంకరించారు. గజానన కారిడార్ 32 వినాయకుడి రూపాలతో అలంకరించడంతో పాటు ప్రతి ఒక్కదాన్నీ పైథాని కళాఖండంతో అద్భుతంగా చెక్కారు. 900 మందికి పైగా ఎంబ్రాయిడరీ కళాకారులు 5వేల గంటలకు పైగా శ్రమించి గణేశుడి పురాణాలు, ప్రాముఖ్యత, దైవిక అద్భుతాలను తెలిపేలా వస్త్రాలను రూపొందించారు. ఐదు లక్షలకు పైగా మువ్వలతో వస్త్రాన్ని రూపొందించి అలంకరించారు.
భూ గ్రహాన్ని కాపాడుకొనేలా..
రిలయన్స్ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వినాయక చవితి వేడుకల డేకరేషన్లో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రాధాన్యమిచ్చింది. వినాయక మండపంలో వాడే వస్త్రం, పువ్వులు, ఆకులు.. ఇలా ప్రతీది ఆలోచనాత్మకంగా ఎంపిక చేసుకుంది. బొమ్మలు, లాకెట్లు తయారు చేసేందుకు పాత దుస్తులు వినియోగించారు. పూలు, వస్త్రాలతో అలంకరించిన పీవీసీ పైపులపై మూషక్, మోదక్ బొమ్మలు వేశారు. గణపతి ఉత్సవాన్ని నిర్వహించడానికి ఉపయోగించే అన్ని సహజ పువ్వులు రీసైకిల్ చేస్తారు. వీటితో మొక్కలకు ఎరువులు, ఆలయాలకు అగరు బత్తీలు తయారు చేయనున్నారు. ఈ మండపంలో సంప్రదాయంగా లభ్యమయ్యే సహజ పట్టు, పత్తి, వస్త్రాలను ఉపయోగించి పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
సోషల్ మీడియా ట్రోలర్ల వికృత రూపం మరోసారి బయటపడింది. పదో తరగతిలో స్టేట్ టాపర్గా నిలిచిన బాలికను వారు వేధించారు. ఒక దశలో కొన్ని మార్కులు తగ్గినా బాగుండు అని ఆమె అనుకొనేలా చేశారు. చివరికి నెటిజన్లు, నాయకులు ఆమెకు అండగా నిలవడంతో ధైర్యం తెచ్చుకొని భవిష్యత్తుపై దృష్టిపెడతానని పేర్కొంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్కు సిట్ అధికారులు డిసెంబరులోనే సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!