జంతువుల్లో కరోనా: టీకా సిద్ధం చేసిన రష్యా
జంవుతుల కోసం తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ 17వేల డోసులతో మొదటి బ్యాచ్ను సిద్ధం చేసినట్లు రష్యా నియంత్రణ సంస్థ వెల్లడించింది.
మాస్కో: మూగజీవాలు కూడా కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రయోగాలు సఫలం కావడంతో ఈమధ్యే వ్యాక్సిన్ను రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించింది. తాజాగా 17వేల డోసులతో కూడిన వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ను సిద్ధం చేసినట్లు రష్యా ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. తొలుత వీటిని రష్యాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తామని తెలిపింది. జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రియా, గ్రీస్, పోలాండ్, కెనడా, మలేసియా, థాయిల్యాండ్, అమెరికాతో పాటు సింగపూర్కు చెందిన పలు సంస్థలు ఈ వ్యాక్సిన్ను కొనేందుకు ముందుకు వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది.
కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కరోనా వైరస్ సోకుతున్నట్లు కొన్ని దేశాల్లో ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటికీ వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు కొంతకాలం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జంతువుల్లోనూ ప్రయోగాలు చేపట్టిన రష్యా.. ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. ‘కార్నివాక్-కొవ్’ పేరుతో రష్యా జాతీయ జంతువుల సంరక్షణ విభాగం ఈ వ్యాక్సిన్ను రూపొందించింది. కుక్కలు, పిల్లులు, నక్కలతో పాటు ఇతర మూగజీవాలపై గతేడాది నుంచే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టామని.. వాటిలో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడైనట్లు తెలిపింది. ఈమధ్యే వీటికి అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించింది. తాజాగా వ్యాక్సిన్ డోసులను కూడా అందుబాటులోకి తేవడంతో జంతువులకు కరోనా వ్యాక్సిన్ను తీసుకువచ్చిన తొలిదేశంగా రష్యా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బాలుడు.. దృశ్యాలు వైరల్
Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో.. ఓ బాలుడు ఓటు వేసిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
-
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
-
దలాల్ దఢేల్: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
-
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
-
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
-
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు