Canada Elections: కెనడా ప్రధాని.. హ్యాట్రిక్ విజయం..!
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.
పూర్తి మెజారిటీ సాధించడంలో వెనకబడ్డ లిబరల్ పార్టీ
ఒట్టావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది. అధికార లిబరల్ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటీవ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ చివరకు జస్టిన్ ట్రూడోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఎరిన్ ఒ టూలే తమ ఓటమిని అంగీకరించడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో విజయం ఖాయమైంది.
కెనడా పార్లమెంటు (House of Commons)లో మొత్తం 338 సీట్లు ఉండగా.. విజయం సాధించాలంటే 170 సీట్లు పొందాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ 155 స్థానాలకే పరిమితమైంది. పూర్తి మెజారిటీ సాధించనప్పటికీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీ సాధించడంలో విఫలమైంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం 156 స్థానాలు మాత్రమే పొందగలిగింది. ఇక ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ మాత్రం 121 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఓటమిని ఒప్పుకోవడంతో జస్టిన్ ట్రూడో మూడోసారి విజయానికి మార్గం సుగమమైంది.
ముందస్తు వ్యూహం..
కెనడాలో కొవిడ్-19 మహమ్మరిని సమర్థంగా కట్టడి చేశామని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పలుమార్లు పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీలోనూ ముందున్నామని చెప్పుకుంటున్న ట్రూడో.. కొవిడ్పై విజయం సాధించామనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఉన్న జస్టిన్ ట్రూడో.. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆగస్టు నెలలో ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే సమయంలో అఫ్గాన్ నుంచి కెనడియన్లను తరలించడంలోనూ ట్రూడో విఫలమయ్యారనే విమర్శలు మొదలయ్యాయి. ఇదే వ్యతిరేకతను ప్రతిపక్ష కన్జర్వేటర్లు అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ మళ్లీ విజృంభించడాన్ని ప్రస్తావిస్తూ.. కొవిడ్ నియంత్రణలో ట్రూడో విఫలమయ్యారనే ప్రచారం చేశారు. ఇలా ఎన్నికలు సమీపించే నాటికి అధికార లిబరల్స్కు ఓటర్ల మద్దతు తగ్గగా.. కన్జర్వేటర్లకు మద్దతు పెరుగుతోందని సర్వేలు వెల్లడించాయి. ఇది ట్రూడోను కాస్త ఆందోళనకు గురిచేసినప్పటికీ చివరకు కెనడియన్లు ఆయనవైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
భారత సంతతి ప్రాతినిధ్యం అధికమే..!
ఇదిలాఉంటే, కెనడా పార్లమెంటు ఎన్నికల్లో భారతీయల ప్రాతినిధ్యం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో దాదాపు 20మంది భారతీయ మూలాలున్న కెనడియన్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి కూడా దాదాపు 49మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 16మంది కన్జర్వేటివ్ పార్టీ నుంచి కాగా.. మరో 15 మంది అధికార లిబరల్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఇక జగ్మీత్ సింగ్కు చెందిన న్యూ డెమోక్రాటిక్ పార్టీ (NDP) నుంచి 12 మంది, ఇతర పార్టీల నుంచి మరో ఆరుగురు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డారు. ఇప్పటికే ప్రస్తుత కేబినెట్లో భారతీయ మూలాలున్న ముగ్గురు మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం