canada: కెనడా ప్రధాని ట్రూడోకు వరుస షాక్లు..!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో న్యూదిల్లీలో జరిగిన జీ20 సద్సస్సును అంత తేలిగ్గా మర్చిపోలేరు. సదస్సులో చేదు అనుభవాలకు తోడు.. ఆయన విమానం మొరాయించడంతో రెండు రోజులు అదనంగా దిల్లీలోని ఉండిపోవాల్సి వచ్చింది.
మన టైమ్ బాగోలేకపోతే ఎక్కడ ఎక్కువ సేపు ఉండకూడదనుకుంటామో.. అక్కడే రోజుల తరబడి గడపాల్సి వస్తుంది. ప్రస్తుతం కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau ) పరిస్థితి ఇదే. జీ20 ఘనంగా ముగిసింది.. అతిథులు అందరూ వెళ్లిపోయారు.. ఒక్క ట్రూడో తప్ప. ఆయన అధికారిక విమానంలో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం కూడా ఆయన బయల్దేరడం అనుమానమే. ట్రూడో కోసం మరో విమానాన్ని కెనడా ఎయిర్ఫోర్స్ పంపింది. దీనిని తొలుత రోమ్ మీదుగా దిల్లీకి చేర్చాలని భావించారు. కానీ, ఆ తర్వాత మార్గం మార్చి లండన్ రూట్ వైపు మళ్లించారు.
జీ20 సదస్సులో కూడా అంటీ ముట్టనట్లు..
- ట్రూడో వ్యవహారశైలి జీ20లో కూడా అంటీ ముట్టనట్లు ఉంది. ఆయన సదస్సు తొలిరోజు నిర్వహించిన విందుకు కూడా హాజరు కాలేదు. దీనికి కారణం చెప్పేందుకు కెనడా ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించిందని అక్కడి పత్రికలు కథనాలు రాశాయి.
- ఇక ప్రపంచ దేశాధినేతలు రాజ్ఘాట్లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు. దీంతో ప్రధాని మోదీ ఆయన్ను చేయి పట్టుకొని అక్కడి విశేషాలు వివరించేందుకు యత్నించారు. కానీ, ట్రూడో సున్నితంగా చేయి వెనక్కి తీసుకోవడంతో మోదీ కూడా మిన్నకుండిపోయారు. ఈ ఘటనపై విలేకర్లు ట్రూడోనే నేరుగా ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అనుకోవచ్చని సమాధానమిచ్చారు.
- జీ20 చివరి రోజున మోదీ-ట్రూడో భేటీ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఈ భేటీలో మోదీ నేరుగా ట్రూడో వద్దే భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందడాన్ని ప్రస్తావించారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. దౌత్యవేత్తలపై దాడులు, దౌత్యకార్యాలయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-కెనడా దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటన రూపంలో విడుదల చేయడం గమనార్హం.
- తాజాగా ట్రూడో దిల్లీలో ఉండగానే కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి బెదిరింపులు రావడం మరింత ఇబ్బందికరంగా మారింది.
- ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలు ఆయన్ని పట్టించుకోలేదని.. ఇది అవమానకరమని కెనడా ప్రతిపక్ష నేత పెర్రి పొయిలివ్రే ఎద్దేవా చేశారు.
పర్యటనకు ముందే కొన్ని ఘటనలు..
ఈ పర్యటనకు కొద్ది రోజుల ముందే తాము భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కెనడా ప్రకటించింది. దీనికి సరైన కారణం వెల్లడించలేదు. ఇక జులైలో కెనడాలోని ఖలిస్థానీ గ్రూపులు భారత దౌత్యవేత్తలను బెదిరిస్తూ పోస్టర్లు జారీ చేశాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. ఇరు దేశాల సంబంధాలపై ఈ ఘటన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.
2018లోనూ వివాదాస్పదమే..
2018లోనూ భారత్ పర్యటనలో ట్రూడో భారీగా విమర్శల పాలయ్యారు. అప్పట్లో ఆయన గౌరవార్థం కెనడా హైకమిషన్ ఇచ్చిన విందుకు మాజీ ఖలిస్థానీ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్ను ఆహ్వానించారు. ఇది ట్రూడోను దౌత్యపరమైన చిక్కుల్లోకి నెట్టింది. ఈ ఘటనల కారణంగా భారత్ ప్రభుత్వం అప్పట్లో ఆయన పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అధికారిక కార్యక్రమాలు తక్కువగా జరిగాయి. పర్యటక ప్రాంతాల సందర్శన కోసం ట్రూడో భారత్ వెళ్లినట్లుందని స్వదేశంలో విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇక కెనడా అధికారిక విమానాల విషయానికొస్తే అవి ఆ దేశ ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఇదే తొలిసారి కాదు. 2016లో బెల్జియం బయల్దేరిన విమానం సాంకేతిక సమస్యతో తిరిగి కెనడాకే రావాల్సి వచ్చింది. ఇక 2019 అక్టోబర్ ఈ విమానం ఓ గోడను పొరబాటున ఢీకొంది. అప్పట్లో దీని ముక్కుభాగం దెబ్బతింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్