Climate Change: ఉష్ణోగ్రతలు తగ్గాలంటే 30 ఏళ్లు..
‘భూ వాతావరణం వేగంగా వేడెక్కుతోంది.. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. భారీ వర్షాలు, వడగాడ్పులు తరచూ సంభవిస్తున్నాయి.. మానవ చర్యలే ఈ మార్పులకు ప్రధాన కారణమ’ని ఐరాసకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్(ఐపీసీసీ) తన నివేదిక(అసెస్మెంట్ రిపోర్ట్)లో ఆందోళన వ్యక్తం చేసింది.
ఐరాస ‘ఐపీసీసీ’ నివేదికలో వెల్లడి
ఇంటర్నెట్ డెస్క్: ‘భూ వాతావరణం వేగంగా వేడెక్కుతోంది.. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. భారీ వర్షాలు, వడగాడ్పులు తరచూ సంభవిస్తున్నాయి.. మానవ చర్యలే ఈ మార్పులకు ప్రధాన కారణమ’ని ఐరాసకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్(ఐపీసీసీ) తన నివేదిక(అసెస్మెంట్ రిపోర్ట్)లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం సోమవారం దీన్ని విడుదల చేసింది. కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్హౌస్ ఉద్గారాలను నియంత్రిస్తే.. మంచి మార్పులు తీసుకురావచ్చని, కానీ.. అన్ని దేశాలు ఇందుకు అంగీకరించాలని పేర్కొంది. ఒకవేళ ఈ ఏడాది చివరి నాటికి ముందుకొచ్చినా.. వాతావరణ ఉష్ణోగ్రతల స్థిరీకరణకు 20 నుంచి 30 ఏళ్లు పట్టొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఈ నివేదికను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. వాతావరణ శాస్త్రంపై వివరణాత్మక సమీక్షగా అభివర్ణించారు. ‘కోడ్ రెడ్ ఫర్ హ్యూమానిటీ’గా చెప్పుకొచ్చారు. ఐపీసీసీలో 195 దేశాలు ఉండగా.. వాటిలో భారత్ ఒకటి.
ఐపీసీసీ నివేదికలోని అంశాలు..
* వాతావరణం వేగంగా వేడెక్కిపోతోంది. బాంబ్షెల్ నివేదిక ప్రకారం 2030 వరకు సాధారణ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్పెరిగే ప్రమాదం ఉంది. 2018లో అంచనా వేసిన దానికంటే ఒక దశాబ్దం ముందే సంభవించడం గమనార్హం.
* ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1901- 1971 మధ్య సగటు రేటు ఏడాదికి 1.3 మిల్లీమీటర్లు ఉండగా.. 2006- 2018 మధ్య 3.7 మి.మీలకు చేరింది. మొత్తం 1901- 2018 మధ్య చూసుకుంటే సముద్ర మట్టాలు 0.20 మీటర్లు పెరిగాయి.
* అనేకప్రాంతాల్లో తరచూ వడగాడ్పులు సంభవిస్తున్నాయి. 1950ల నుంచి వీటి సంఖ్య, తీవ్రత పెరిగిపోయింది. మరోవైపు శీతల పవనాలు తగ్గుముఖం పట్టాయి.
* గ్లోబల్ వార్మింగ్కు నగరాలే ప్రధాన కేంద్రాలుగా మారాయి. వేడిని అవి పట్టి ఉంచడం ఇందుకు ప్రధాన కారణం. జల వనరులు, వృక్షసంపద కనుమరుగవుతుండటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.
* 50 ఏళ్లకోసారో, పదేళ్లకోసారో సంభవించే భారీ వర్షాలు, అతి ఉష్ణోగ్రతలు, కరవులు.. తరచూ వస్తున్నాయి. తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. ఇవి అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. భిన్న ఉత్పాతాలు ఒకేసారి సంభవిస్తున్నాయి. మరోవైపు విపత్తులకు ప్రధాన కారణాలు కనుక్కోవడం కష్టతరంగా మారుతోంది.
* వాతావరణ మార్పు, నాణ్యత.. నాణేనికి రెండు వైపుల్లాంటివి. రెండింటి సమస్యలను కలిసి పరిష్కరించడం ద్వారా గణనీయ ఫలితాలు పొందవచ్చు.
*. శిలాజ ఇంధనాల వినియోగం, గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేసే కార్యకలాపాలను పూర్తిగా కట్టడి చేయడం ద్వారా ఈ శతాబ్ది చివరినాటికి గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించవచ్చని ఐపీసీసీ తన నివేదికలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
హరియాణాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
భారత్ ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన దేశంగా మాత్రమే కాకుండా శక్తిమంతమైన దేశంగాను పేరు పొందుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్