Vande Bharat Express: వందేభారత్ రైలుకు మరో ప్రమాదం.. నెలలో మూడో ఘటన
వందే భారత్ రైలుకు పశువులు ఢీ కొట్టే ఘటనలను తప్పించలేమని, రైలు డిజైనింగ్ సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
గాంధీనగర్: ముంబయి- గాంధీనగర్ మధ్య కొద్దివారాల క్రితం ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం గుజరాత్లోని అతుల్ రైల్వే స్టేషన్ పరిధిలో సెమీ హై స్పీడ్ రైలును పశువు(Bull) ఢీకొనడంతో కొద్దిసేపు ఆగిపోయింది. నెలరోజుల వ్యవధిలో ఈ తరహాలో జరిగిన మూడో ఘటన ఇది. ఈ రైలు డ్రైవర్ బోగీ నోస్ కోన్ కవర్ ధ్వంసమైందని భారత రైల్వే శాఖ వెల్లడించింది.
గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ సెమీ- హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ ఇటీవలే జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే తరచూ ఈ ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి. పశువులు ఢీ కొట్టే ఘటనలను తప్పించలేమని, రైలు డిజైనింగ్ సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామని గతంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి