Vaccination: సిబ్బంది రాగానేఒకరు చెట్టెక్కేశారు.. మరొకరు ఫైటింగ్ చేశారు..!
దేశంలో కరోనా టీకా కార్యక్రమం కీలక మైలురాళ్లను దాటుకుంటూ తుది అంకం చేరుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తున్నా.. ఇంకా కొంతమందిలో అపోహలు వీడటం లేదు. అందుకు ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో తాజాగా జరిగిన రెండు సంఘటనలే నిదర్శనం.
లఖ్నవూ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కీలక మైలురాళ్లను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తున్నా.. ఇంకా కొంతమంది అపోహలు వీడటం లేదు. దీనికి ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో తాజాగా జరిగిన రెండు సంఘటనలే నిదర్శనం.
యూపీలో కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం వైరస్ విజృంభిస్తుండటంతో ఎన్నికల సమయానికల్లా అర్హులందరికీ టీకా అందేలా చూడాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది. దానిలో భాగంగా అధికారులు బలియా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. యూపీ మొత్తం మీద అత్యల్ప వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇది కూడా ఒకటి కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో టీకా ఇవ్వడానికి సిబ్బంది రాగానే ఒక వ్యక్తి చెట్టెక్కగా.. మరోవ్యక్తి సిబ్బందిని తోసేసి టీకా ఇప్పుడొద్దంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న కొందరు చిత్రీకరించిన వీడియోల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.
సిబ్బంది చూడగానే ఒక వ్యక్తి వారికి దొరక్కుండా చెట్టెక్కేశాడు. ఏం కాదు కిందికి రావాలని అక్కడున్నవారు పిలిచినా తొలుత వినిపించుకోలేదు. ‘నేను రాను. నాకు టీకా వద్దు. భయం వేస్తోంది’ అంటూ ఆ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. తర్వాత అంతా సర్దిచెప్పడంతో ఎట్టకేలకు అంగీకరించి వ్యాక్సిన్ తీసుకున్నాడు. మరోవ్యక్తి మాత్రం టీకా తీసుకోవడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన సిబ్బందితో చిన్నపాటి ఫైటింగ్ కూడా చేశాడు. వారి నుంచి తప్పించుకొని.. ‘ఇప్పుడు కాదు, నేను తర్వాత టీకా వేయించుకుంటాను’ అంటూ దూరంగా వెళ్లిపోయి నిల్చుకున్నాడు. ‘తర్వాత ఎందుకు.. ఇప్పుడు తీసుకో’ అంటూ అధికారులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతడు ససేమిరా అన్నాడు. వ్యాక్సిన్పై ప్రజలకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ..అనేక సవాళ్ల మధ్య వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది.
మరోపక్క రాష్ట్రంలో 95 శాతం మంది అర్హులు మొదటి డోసు తీసుకున్నారని, 62 శాతం మందికి రెండో డోసు అందిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వెల్లడించారు. ఇక 24 గంటల వ్యవధిలో యూపీలో 17 వేల కరోనా కేసులు రాగా, ఆరుగురు మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.