న్యూజిలాండ్ పార్లమెంట్లో మలయాళం మాట్లాడితే..
న్యూజిలాండ్ పార్లమెంట్కు రెండోసారి ఎన్నికై మంత్రి పదవిని దక్కించుకున్న భారత సంతతి మహిళ ప్రియాంక రాధాకృష్ణన్ పార్లమెంట్లో మలయాళంలో మాట్లాడిన ఓ వీడియో వైరల్గా మారింది...
పాత వీడియోను పంచుకున్న పౌర విమానయానశాఖ మంత్రి
దిల్లీ: న్యూజిలాండ్ పార్లమెంట్కు రెండోసారి ఎన్నికై మంత్రి పదవిని దక్కించుకున్న భారత సంతతి మహిళ ప్రియాంక రాధాకృష్ణన్ పార్లమెంట్లో మలయాళంలో మాట్లాడిన ఓ వీడియో వైరల్గా మారింది. మూడేళ్ల క్రితం తన మాతృభాష అయిన మలయాళంలో మాట్లాడిన వీడియోను భారత పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కేరళ మూలాలున్న ఆమె 2017లో లేబర్ పార్టీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అదే ఏడాది నవంబర్లో జరిగిన పార్లమెంటు సమావేశంలో రాధాకృష్ణన్ కొద్దిసేపు మలయాళంలో మాట్లాడారు. మాతృభాషలో మాట్లాడిన అనంతరం ఈ పార్లమెంట్లో నా మాతృభాష అయిన మలయాళం మాట్లాడటం ఇదే మొదటిసారి అని భావిస్తున్నాను అని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా న్యూజిలాండ్ పార్లమెంట్కు రెండోసారి ఎన్నికైన ప్రియాంకను రెండోసారి ప్రధానిగా ఎన్నికైన జెసిండా ఆర్డెన్స్ మంత్రి పదవిని అప్పగించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకొని 2017లో ప్రియాంక మాట్లాడిన ఆ వీడియోను మంత్రి హర్దీప్సింగ్ పూరి ట్విటర్లో షేర్ చేశారు. ‘న్యూజిలాండ్ పార్లమెంట్లో మలయాళంలో మాట్లాడి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు’ అని రాధాకృష్ణన్ను మంత్రి కొనియాడారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
కేరళ మూలాలున్న ప్రియాంక కుటుంబం మొదట సింగపూర్కు వలసవెళ్లింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న ప్రియాంక ఉన్నత చదువులకోసం న్యూజిలాండ్కు వెళ్లారు. అక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసుకొన్నారు. 2017లో మొదటిసారి న్యూజిలాండ్ పార్లమెంట్కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్ పార్లమెంట్కకు ఎన్నుకోబడిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. కాగా రెండోసారి ఎన్నికైన ఆమె ఈసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!