YouTube: చంద్రయాన్-3 ‘రికార్డు’ అద్భుతం.. యూట్యూబ్ సీఈఓ
చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రయోగంపై యూట్యూబ్లో ఇస్రోలైవ్ స్ట్రీమింగ్ రికార్డు సృష్టించింది. దీనిపై యూట్యూబ్ చీఫ్ స్పందించారు.
దిల్లీ: భారత్ జాబిల్లిపైకి పంపిన చంద్రయాన్-3(Chandrayaan-3) విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ ప్రయోగంతో సోషల్ మీడియాలో నమోదైన ఓ రికార్డు గురించి యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్(YouTube chief Neal Mohan) స్పందించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కు అభినందనలు తెలియజేశారు.
ఆగస్టు 23న చంద్రయాన్-3 ప్రయోగం జరిగింది. దీనిని ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షించారని రెండు రోజుల క్రితం యూట్యూబ్ ఇండియా వీడియోను పోస్టు చేసింది. ‘కొన్ని విషయాలు మమ్మల్ని మైమరపించాయి. భారత్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఆ రోజు యూట్యూబ్లో ఇస్రో లైవ్స్ట్రీమింగ్ను ఏకకాలంలో 8 మిలియన్ల(80 లక్షలు) మంది వీక్షించారు. మా ఆనందానికి పట్టపగ్గాలు లేవు’ అని రాసుకొచ్చింది.
ఆ ఫోన్ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!
తాజాగా ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్(YouTube chief Neal Mohan) ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షకులా.. నమ్మశక్యంగా లేదు. అద్భుతం’అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే యూట్యూబ్( YouTube) షేర్ చేసిన 16 సెకండ్ల క్లిప్లో.. ల్యాండింగ్ సమయంలో ఇస్రో కంట్రోల్ రూమ్లో చోటుచేసుకున్న ఉద్విగ్న పరిస్థితులను బంధించారు.
చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రయోగంలో భాగంగా గతనెల జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్ సురక్షితంగా దిగింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ అధ్యయనం చేసింది. అక్కడ పగటికాలం ముగియడంతో ప్రస్తుతం అవి నిద్రాణంలోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఈ నెల 22న అక్కడ సూర్యోదయమవుతుందని ఇస్రో తెలిపింది. ఆ రోజున అవి మళ్లీ తిరిగి మేలుకుంటాయని ఆశిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్