90s webseries: నా కెరీర్లో మరపురానిది #90s: శివాజీ
ఇండియన్ ఓటీటీలో వచ్చిన అన్ని వెబ్సిరీస్ల్లో టాప్-5లో ఉండదగ్గ వెబ్సిరీస్ మా ‘‘#90's’’ అన్నారు నటుడు శివాజీ. ఆయన.. వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ తెరకెక్కించిన సిరీసే ‘#90's- ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’.
‘‘ఇండియన్ ఓటీటీలో వచ్చిన అన్ని వెబ్సిరీస్ల్లో టాప్-5లో ఉండదగ్గ వెబ్సిరీస్ మా ‘‘#90's’’ అన్నారు నటుడు శివాజీ. ఆయన.. వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ తెరకెక్కించిన సిరీసే ‘#90's- ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. రాజశేఖర్ మేడారం నిర్మాత. మౌళి, వాసంతిక, రోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవీన్ మేడారం సమర్పించారు. ఇటీవలే ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సిరీస్.. ప్రేక్షకుల్ని మెప్పించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో శుక్రవారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో ఇదొక మరపురాని సిరీస్. ఈ సిరీస్ ‘ఈటీవీ విన్’ ద్వారా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ ఒక్క సిరీస్తో 5లక్షల సబ్స్క్రైబర్స్ రావడం మామూలు విషయం కాదు. దర్శకుడు ఆదిత్య రచన వల్లే ఇదంతా సాధ్యమైంది. దీన్ని త్వరలో సినిమాలా విడుదల చేస్తారని అనుకుంటున్నా. అజిమ్ ఛాయాగ్రహణం ఈ సిరీస్కి అదనపు ఆకర్షణ. సురేశ్ బొబ్బిలి చాలా చక్కటి సంగీతమందించారు. ‘సాంప్రదాయని’ ట్యూన్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతోంది. ఈ సిరీస్ ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు పూర్తయ్యిందో కూడా తెలియలేదు. అంత సాఫీగా ఈ ప్రయాణం సాగిపోయింది. ఇందులో ఉన్న ప్రతి చిన్న పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుందంటే దానికి కారణం స్క్రిప్ట్. అది బాగున్నప్పుడు.. దానికి తగ్గ ఆర్టిస్ట్లు దొరికినప్పుడు కచ్చితంగా ఇలాంటి రికార్డ్సే బయటకొస్తాయి. మౌళి, రోహన్, వాసంతిక అందరూ చక్కగా చేశారు. అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. వాసుకి అద్భుతంగా నటించారు. ఈటీవీ విన్కు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘మా ‘‘#90's’ అందరికీ చేరవవుతోంది. ముఖ్యంగా 90ల తరం దీనికి బాగా కనెక్ట్ అయ్యింది. వాళ్ల నుంచి వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిచ్చింది. శివన్న, వాసుకి.. మిగతా నటీనటులు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకుడు ఆదిత్య హాసన్. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరీస్ ఇది. వాసుకి ఎంతో సహజంగా నటించారు. నా చిన్నప్పుడు మా అమ్మలా అనిపించారు. శివాజీ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. రోహన్ చాలా చక్కటి టైమింగ్తో నటించాడు. దర్శకుడు ఆదిత్య ఓ మాస్టర్ పీస్ను అందించారు. సంక్రాంతికి థియేటర్సే కాదు.. ఓటీటీలు కూడా హిట్స్ ఇస్తాయనడానికి ‘‘#90's’ ఓ నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ సిరీస్పై మేము పెట్టుకున్న నమ్మకం నిజమైంది. 200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న తొలి తెలుగు వెబ్సిరీస్ ఇది. ఇంత తక్కువ సమయంలో అంతటి వ్యూయర్ షిప్ రావడం ఇదే తొలిసారి. ఇంత అద్భుతమైన ఆదరణ చూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సాయికృష్ణ. ఈ కార్యక్రమంలో వాసుకి, మౌళి, రోహన్, వాసంతిక తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. -
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్.. పేరేంటంటే
నటి యామీ గౌతమ్ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
‘మిరాయ్’ ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ లుక్!
మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని