శింబు-త్రిష వివాహం..?

‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ఏమాయ చేశావే) చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటీనటులు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శింబు-త్రిష మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు...

Updated : 16 Oct 2020 10:00 IST

సమాధానం చెప్పని రాజేందర్‌‌

చెన్నై: ‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ఏమాయ చేశావే) చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటీనటులు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేయనున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ తాము మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధానమిచ్చింది.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో త్రిష-శింబు కలిసి ‘కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్‌ గురించి నెట్టింట్లో పలు పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి.

తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఈ ఏడాది శింబు తండ్రి రాజేందర్‌‌‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి‌.. శింబు-త్రిష పెళ్లి‌ గురించి స్పందించమని కోరగా.. ఆయన‌ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని