‘దేవుడు వరమిస్తే జీవించాలనే కోరుకుంటా’
జీవితమంటే తనకెంతో ఇష్టమని, ఒకవేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకుంటానని ఒకానొక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని.. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం....
బాలు కోసం షూటింగ్ వాయిదా వేసిన ఎంజీఆర్
హైదరాబాద్: జీవితమంటే తనకెంతో ఇష్టమని, ఒకవేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకుంటానని ఒకానొక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని.. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే జీవితంపై తనకున్న ఇష్టం గురించి బాలు ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు..
‘అనుకోకుండా నేను సినీ గాయకుడిగా మారాను. స్వరానికి సంబంధించి నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించను. జీవితమంటే నాకెంతో ఇష్టం. జీవితాన్ని బాగా ప్రేమిస్తాను. భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా బతకాలనే కోరుకుంటా. మనిషిగా పుట్టడం ఓ గొప్ప వరం. మనం ఎంతో అందంగా జీవించాలి. అలాగే నాకు నా వృత్తి అంటే గౌరవం. నా వృత్తే నాకు దేవుడు. వృత్తి కోసం నా ఇష్టాలను వదులుకోవాలనుకోవడం లేదు. ఒక నిబద్ధతతో మనకిష్టమైన ప్రతీది అనుభవిస్తూ.. మన వృత్తిని కూడా ముందుకు తీసుకువెళ్లొచ్చు అనడానికి నేను ఓ ఉదాహరణ. చాలామంది గాయకులు ఇది తినకూడదు, చల్లదనం తాగకూడదు.. ఇలా ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ అవన్నీ నా వల్ల కాదు. ఐస్వాటర్, ఐస్క్రీమ్ లేకుండా నేను ఉండలేను.’
‘‘శాంతినిలయం’ చిత్రంలో ఎం.ఎస్ విశ్వనాథ్ మొదటిసారి నాకు తమిళ సినిమాలో పాడే అవకాశమిచ్చారు. ఎంజీఆర్ నటించిన ఓ తమిళ సినిమాలోని సౌందర్రాజన్ పాడిన పాటకు తెలుగులో నేను డబ్బింగ్ పాడాను. ఏవీఎం థియేటర్లో ఆ పాట రికార్డింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి ఎంజీఆర్ వచ్చారు. నా పాట విని, నా గురించి వేరే వాళ్లని అడిగి తెలుసుకున్నారు. తన సినిమాలో నాకు అవకాశమివ్వాలనుకుంటున్నట్లు ఎంజీఆర్ ఆ మరుసటి రోజు మహదేవన్తో చెప్పారు. అలా నాకు ఎంజీఆర్ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ పాట కోసం నాలుగురోజులు రిహార్సిల్స్ కూడా చేశాను. అయితే పాట రికార్డింగ్కు కొన్నిరోజుల ముందు.. నాకు టైఫాయిడ్ వచ్చింది. పాట రికార్డ్ చేయాల్సిన ముందురోజు ప్రొడెక్షన్ మేనేజర్ నా రూమ్కి ఇచ్చారు. జ్వరంతో ఉన్న నన్ను చూసి వెళ్లిపోయారు. దాంతో ఆ అవకాశం పోయిందనుకున్నాను. దాదాపు నెలన్నర తర్వాత అదే ప్రొడెక్షన్ మేనేజర్ నా దగ్గరకి వచ్చి.. ‘మీరు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా?అని ఎంజీఆర్ కనుక్కుని రమ్మన్నారు. ఆరోగ్యంగా ఉంటే రేపు రిహార్సిల్స్కి రమ్మన్నారు’ అని చెప్పాడు. ఆ మరుసటి రోజు రికార్డింగ్ థియేటర్కి వెళ్లగానే ఎంజీఆర్ నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, పాట రిహార్సిల్స్ చేయమన్నారు. ఒకప్పుడు అనారోగ్యం వల్ల ఏదైతే పాటను పాడలేకపోయానో.. అదే పాట ఇప్పుడు మళ్లీ రిహార్సిల్స్ చేయమంటున్నారు ఎందుకా? అని ఆశ్యర్యానికి గురయ్యాను. ఆయన్ని అడగడానికి ధైర్యం సరిపోలేదు. సదరు పాట రికార్డింగ్ పూర్తయ్యాక ధైర్యం చేసి ఎంజీఆర్తో మాట్లాడాను. ‘సర్.. ఈ పాట రికార్డింగ్ చేయాలనుకుని దాదాపు రెండు నెలలు అయిపోయింది. అలాగే ఈ పాట షూటింగ్ కోసం రాజస్థాన్లో అనుమతులు కూడా తీసుకున్నారు? మరి ఎందుకని ఇంత వరకూ ఆగారు?’ అని అడిగాను. దానికి ఆయన.. ‘బాలసుబ్రహ్మణ్యం.. నువ్వు ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్నానని చెప్పావు. మొదట ఈ పాట రిహార్సిల్స్ చేయగానే నీ స్నేహితులందరికీ వినిపించి ఉంటావు. పాట గురించి అందరికీ చెప్పి ఉంటావు. రిహార్సిల్స్లో భాగంగా అందరికీ నువ్వు పాడి వినిపించిన ఈ పాటను సినిమాలో మరొకరితో పాడిస్తే.. నువ్వు పాడింది నచ్చకే మరొకరికి అవకాశమిచ్చామనుకుంటారు. అది నీ భవిష్యత్తుకు మంచిది కాదు. అందుకే నేను షూటింగ్ వాయిదా వేసుకున్నాను’ అని చెప్పారు. ఆయనలో ఉన్న మానవీయత ఎంతో గొప్పది. ఇలాంటి చిన్న చిన్న అదృష్టాలే నన్ను ముందుకు తీసుకువెళ్లాయి.’ అని బాలు ఓ ఇంటర్యూలో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!