‘బచ్చన్‌ పాండే’ గ్యాంగ్‌లో...

అక్షయ్‌కుమార్‌తో కలిసి మరోసారి సందడి చేయనుంది శ్రీలంక సుందరి జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. అక్షయ్‌ ప్రధాన పాత్రలో తెర కెక్కుతోన్న చిత్రం ‘బచ్చన్‌పాండే’. ఈ చిత్రబృందంలోకి జాక్వెలైన్‌ చేరింది. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షాజిద్‌...

Published : 02 Dec 2020 11:24 IST

 

ముంబయి: అక్షయ్‌కుమార్‌తో కలిసి మరోసారి సందడి చేయనుంది శ్రీలంక సుందరి జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. అక్షయ్‌ ప్రధాన పాత్రలో తెర కెక్కుతోన్న చిత్రం ‘బచ్చన్‌పాండే’. ఈ చిత్రబృందంలోకి జాక్వెలైన్‌ చేరింది. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఇందులో కృతిసనన్‌ మరో నాయిక. ఈ చిత్రంలో భాగమైనందుకు జాక్వెలైన్‌ ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఆ అనుభూతి ఎలా ఉండనుందో అని ఎదురుచూస్తున్నాను. షాజిద్‌ సార్, అక్షయ్‌లతో కలిసి మళ్లీ మళ్లీ పనిచేయడం సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌  అవుతుంది’’అని చెప్పింది జాక్వెలైన్‌. ఇందులో అక్షయ్‌ ఓ గ్యాంగ్‌స్టర్‌గా, కృతి జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. అక్షయ్‌ స్నేహితుడిగా అర్షద్‌ వార్షి నటిస్తున్నాడు. జనవరిలో రాజస్థాన్‌లో జరిగే షెడ్యూల్‌లో జాక్వెలైన్‌ సెట్లోకి అడుగుపెట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని