‘గమనం’.. చాలా ప్రత్యేకం

శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రల్లో సుజనా రావు తెరకెక్కించిన బహు భాషా చిత్రం ‘గమనం’. రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు.

Updated : 07 Dec 2022 20:13 IST

శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రల్లో సుజనా రావు తెరకెక్కించిన బహు భాషా చిత్రం ‘గమనం’. రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు. ఇళయరాజా స్వరాలందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ ‘‘సుజనా రావు గుండె లోతుల్లో నుంచి వచ్చిన కథతో రూపొందిన చిత్రమిది. ఇందులో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అంది. ‘‘సుజనా కథ చెప్తున్నప్పుడే ఈ చిత్రానికి నేను రాయాలి అనిపించింది. ప్రతి ఫ్రేమ్‌లో ఆమె తపన కనిపిస్తుంది’’ అన్నారు సాయిమాధవ్‌ బుర్రా. ‘‘మనం ఏ కథ చెప్పినా దానికి ఓ చక్కటి అర్థం ఉండాలి. అలాంటి మంచి కథతో తెరకెక్కిన చిత్రమే మా ‘గమనం’. ఇళయరాజా సర్‌కు కథ వినిపించాక.. ‘లే.. లేచి నిలబడు’ అన్నారు. నాకు భయం వేసింది. తర్వాత ఫొటో తీసుకుని మనం సినిమా చేస్తున్నాం అన్నారు.’’ అని తెలిపారు సుజనా రావు. కార్యక్రమంలో శివ కందుకూరి, బాబా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని