మనవడి ఎంట్రీ.. టీజర్‌ రిలీజ్‌ చేసిన సామ్‌

‘ఓ బేబీ’.. సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి సృష్టించిన సూపర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సినీ ప్రేమికుల ఆదరణ పొందిన ఈ సినిమాలో సమంత మనవడిగా అలరించారు ఒకప్పటి బాలనటుడు తేజ. కాగా, తేజ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘జాంబిరెడ్డి’. ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం....

Published : 05 Dec 2020 15:08 IST

హైదరాబాద్‌: ‘ఓ బేబీ’.. సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి సృష్టించిన సూపర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సినీ ప్రేమికుల ఆదరణ పొందిన ఈ సినిమాలో సమంత మనవడిగా అలరించారు ఒకప్పటి బాలనటుడు తేజ. కాగా, తేజ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘జాంబిరెడ్డి’. ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా సమంత విడుదల చేశారు. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజకు జంటగా ఆనంది సందడి చేయనున్నారు. మనిషి మేధాశక్తి వల్ల కొన్నిసార్లు ప్రపంచం ఎదుర్కొనే ప్రమాదాలను గురించి తెలియజేసే విధంగా ‘జాంబిరెడ్డి’ తెరకెక్కినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది.

‘దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం. రాక్షస మనుష్య రూపేణ అన్నది ప్రస్తుతం. భగవంతుడి అద్భుత సృష్టిలో ఒకేఒక్క పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధాశక్తి తనకే ఒక ప్రశ్నగా నిలిస్తే దైవం నేర్పే గుణపాఠం.. మనిషి ఉనికికే ప్రమాదం’ అంటూ సాగిన ఈ టీజర్‌ ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ఇవీ చదవండి

‘కేజీఎఫ్‌-2’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌..!

‘సలార్‌’ అర్థం చెప్పిన ప్రశాంత్‌ నీల్‌..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని