Acharya: చిరంజీవి- రామ్‌చరణ్‌.. ‘సిరుత పులుల సిందాట’

చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో వీరిద్దరిపై చిత్రీకరించిన ‘భలే భలే బంజారా.. సిరుత పులుల సిందాట’ పాటను ఏప్రిల్‌ 18న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.

Published : 18 Apr 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో వీరిద్దరిపై చిత్రీకరించిన ‘భలే భలే బంజారా.. సిరుత పులుల సిందాట’ పాటను ఏప్రిల్‌ 18న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఆ పాట ఎలా ఉంటుందో తాజాగా కాస్త రుచి చూపించింది. ఆ పాట ప్రోమోను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. చిరు- చరణ్‌ డ్యాన్స్‌ అద్భుతంగా చేసినట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. మణిశర్మ స్వరాలందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని