Nagarjuna: ఒకేచోట కలిసిన సౌత్‌ సెలబ్రిటీలు.. నటుడి పాటకు నాగ్‌ ఫిదా

‘అల.. వైకుంఠపురములో’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలతో ఇటీవల తెలుగు వారిని అలరించారు మలయాళీ నటుడు జయరాం. నటుడిగా సినీ ప్రియుల మన్ననలు అందుకున్న ఆయన తాజాగా గాయకుడిగా సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకున్నారు.

Published : 06 Nov 2022 12:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాలు, షోలు మాత్రమే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకూ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు అగ్ర కథానాయకుడు నాగార్జున. పేరు పొందిన ఓ జ్యువెల్లరీ షోరూమ్‌కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. దసరా వేడుకల్లో భాగంగా తమ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా పనిచేస్తోన్న సెలబ్రిటీలందరి కోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నాగార్జున, ప్రభు, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, స్నేహా, ఆమె భర్త ప్రసన్నతోపాటు కర్ణాటక, కేరళ, ముంబయికు చెందిన పలువురు తారలు ఇందులో పాల్గొన్నారు.

ఎంతో సందడిగా సాగిన ఈ వేడుకల్లో తన గానంతో అలరించారు నటుడు జయరాం. ప్రభు నటించిన ‘చిన్నతంబి’, నాగార్జున ‘గీతాంజలి’ చిత్రాల్లోని పాటలను ఆలపించి సెలబ్రిటీల మది గెలుచుకున్నారు. అనంతరం దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తుచేసుకుంటూ ‘రాజకుమారా’ పాట పాడారు. ఇటీవల విడుదలైన ఈ వీడియోపై నాగార్జున స్పందిస్తూ.. జయరాంకు ధన్యవాదాలు చెప్పారు. అద్భుతంగా పాడారని చెప్పారు. నాగ్‌ ట్వీట్‌తో ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని