Akkineni Nagarjuna: నేను, నాన్న.. ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అంటే?
‘కింగ్’లా కనిపించాలన్నా, ‘మన్మథుడి’లా మగువ మనసును దోచేయలన్నా ఆయన తరువాతే ఎవరైనా.. 2016లో వచ్చిన ‘సోగ్గాడే.. చిన్ని నాయనా’తో సంక్రాంతి బరిలో దిగిన అక్కినేని నాగార్జున.. ఈసారి తనయుడు అక్కినేని నాగచైతన్యతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్గా ‘బంగార్రాజు’తో శుక్రవారం (జనవరి 14న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
హైదరాబాద్: ‘కింగ్’లా కనిపించాలన్నా, ‘మన్మథుడి’లా మగువ మనస్సు దోచేయాలన్నా ఆయన తరువాతే ఎవరైనా.. 2016లో వచ్చిన ‘సోగ్గాడే.. చిన్ని నాయనా’తో సంక్రాంతి బరిలో దిగిన అక్కినేని నాగార్జున.. ఈసారి తనయుడు నాగచైతన్యతో ఆ చిత్రానికి సీక్వెల్ ‘బంగార్రాజు’తో శుక్రవారం (జనవరి 14న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంక్రాంతి పండగకే కళ తీసుకొచ్చే చిత్రమని చెబుతున్న నాగ్.. గురువారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
ఈ సారి పెద్ద ‘బంగార్రాజు’ చిన్న ‘బంగార్రాజు’తో కలిసి వస్తున్నారు.. ఎలా అలరించబోతున్నారు?
నాగార్జున: ఈరెండు చిత్రాలను పోల్చి చూస్తే మీరు చూడబోయే మార్పే అది. ఈసారి చిన్న ‘బంగార్రాజు’ ఎంట్రీ ఇవ్వనున్నాడు. పెద్ద బంగార్రాజులో యూత్ఫుల్ ఎనర్జీ మిస్ అయ్యింది. ఇందులో నాగచైతన్య యూత్ఫుల్ ఎనర్జీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఈ చిత్రం కోసం ఏదైనా అదనపు బాధ్యతలు స్వీకరించారా?
నాగార్జున: ‘సోగ్గాడే.. ’బాగా ఆడింది. ప్రజలు కూడా ఆస్వాదించారు. అంగీకరించారు. దాన్ని ఇష్టపడిన వాళ్లు ఈచిత్రాన్ని చూడాలనుకుంటారు. ఈసారి దానికన్నా ఎక్కువ అలరించాలి. ఇది నాకే కాదు.. చైతూకీ పెద్ద బాధ్యతే. ఎందుకంటే నేను నిర్మాత కాబట్టి. మరొకటి.. పండగలాంటి సినిమా ఇస్తున్నామని ముందుకొచ్చాం. అదొకటి మరో బాధ్యతలా అనుకుంటున్నా.
నాగ చైతన్యని చిన్న ‘బంగార్రాజు’గా చూపించడానికి ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా?
నాగార్జున: బ్లడ్లైన్ అనేది మనకు ముందు నుంచి వర్కవుట్ అవుతూ వస్తోంది. రక్త సంబంధాలు ఉన్న నటులు కలిసి నటిస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ‘మనం’ విషయంలో కూడా అదే నిరూపితమైంది. అందుకే నాగచైతన్యని తీసుకున్నాం.
ఇలాంటి తండ్రీ కొడుకుల పాత్ర తెర మీద పోషిస్తున్నప్పుడు నిజజీవిత సంఘటనలు గుర్తొస్తాయి కదా! అలా నాన్నగారు గుర్తొచ్చారా?
నాగార్జున: ఈ పంచె కట్టు ధరించినప్పుడల్లా నాన్న గుర్తొస్తారు. ‘మనం’ సినిమాని వేరే నటులతో తీసి ఉంటే వర్కవుట్ అయ్యేది కాదు. అది డిజైన్డ్. మనం సినిమాలో ఆ మూడు తరాలు నాన్న, నేను, చైతూ లేకపోతే అంత బాగా వచ్చేది కాదు. బాలీవుడ్లో ‘మనం’ చాలా మందికి నచ్చడంతో రీమేక్ కూడా చేద్దామనుకున్నారు. కానీ మా కాంబినేషన్ వల్లే సినిమా వర్కవుట్ అయిందని తెలుసుకున్నారు. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కూడా తీద్దామనుకున్నారు. అయితే ఇదే కాంబినేషన్ అక్కడ వర్కవుట్ అవ్వదేమోనని ఆగిపోయారు. ‘బంగార్రాజు’ కూడా అంతే.
ఈ ‘బంగార్రాజు’కి సీక్వెల్ వస్తుందంటారా?
నాగార్జున: సీక్వెల్ తీద్దామని ‘సోగ్గాడే..’ సమయంలో ఆలోచన లేదు. సినిమా బాగా ఆడిన తర్వాత దాని గురించి చూద్దామనిపించింది. అందులో ఉండే సీనియర్ బంగార్రాజు ఆత్మ ఎప్పుడైనా, ఎక్కడికైనా రావొచ్చు. కాబట్టి ‘బంగార్రాజు’ సీక్వెల్ ఉంటుందా.. లేదా? అన్నది ఒక వారంలో నిర్ణయం తీసుకొని చెబుతా (నవ్వులు)
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్తో మీ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మీ సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సాంగ్స్ హిట్ అవ్వడంతో ‘మ్యూజికల్ నైట్’ కూడా నిర్వహించారు. మరి అనూప్ గురించి?
నాగార్జున: అలాని ఏం లేదండి. బయట కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నితిన్- నిత్యామేనన్ ‘ఇష్క్’లో సంగీతం నచ్చాక ‘మనం’కు ఒప్పుకొన్నాం. అనూప్ రూబెన్స్ మాకు స్పెషల్. టైమ్ ఇస్తాడు. టైమ్ తీసుకుంటాడు. అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబసభ్యుడిలా ఉంటాడు. ఇది బాలేదని చెప్పినా ఫీల్ అవ్వడు. మళ్లీ మంచి మ్యూజిక్తో వస్తాడు. నేను అడగక ముందే దర్శకుడు కల్యాణే అనూప్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ‘సోగ్గాడే..’ కన్నా ఇందులో సంగీతం బాగా ఇచ్చాడు. ‘మనం’కి ఎలా మ్యూజికల్ నైట్ చేశామో.. అలాగే ‘బంగార్రాజు’కి చేశాం.
‘బంగార్రాజు’ పాత్రని గతంలో మీరు చేశారు. ఇప్పుడు చైతూ చేస్తున్నారు. మరి బంగార్రాజు బాడీ లాంగ్వేజ్ పండేలా ఎలాంటి సలహాలు చైతూకి ఇచ్చారు?
నాగార్జున: ‘చైతూ’నే సోగ్గాడే నాలుగైదు సార్లు మళ్లీ చూశాడు. ఇందులో సినీయర్ బంగార్రాజు ఎంటర్ అయ్యాక మాడ్యులేషన్ మారుతుంది. దాని కోసం చై డైలాగ్స్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. అవే చైతూ ఫాలో అయ్యేవాడు. నాకన్నా కల్యాణ్కి గోదావరి యాసపై పట్టుంది. సో, తను ఇంకా బాగా సలహాలిచ్చేవాడు.
మీరు ట్రెండీ పాత్రలు, పల్లెటూరి పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతారు. ఆ కనెక్షన్ ఎలా కుదిరింది?
నాగార్జున: చిన్నప్పటి నుంచి నాన్న గారి నుంచే వచ్చింది (నవ్వుతూ). ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు.. ఇలాంటి పాత్రల్లో బాగా ఒదిగిపోవచ్చు. అందులో పూర్తిగా ఓపెన్ అవ్వొచ్చు. పల్లెటూరి పాత్రల్లో చిన్నపాటి పొగరుబోతుతనం ఉంటుంది. అలాంటి పాత్రలు, భాషన్నా చాలా ఇష్టం.
మీ కెరీర్లో ‘నాగార్జున- రమ్యకృష్ణ’ అంటే సక్సెస్ఫుల్ జంట. మరి దాన్ని ఎలా నిర్వచిస్తారు?
నాగార్జున: ఓ గోల్డెన్ కాంబినేషన్ మాది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇద్దరం ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతాం. సెట్లో రమ్య ఉంటే సందడి వాతావరణమే. అందరినీ నవ్విస్తుంటుంది.
మీ కెరీర్లో ఫలానా పండగకి రావాలని ఎప్పుడు పట్టుబట్టి ఏ చిత్రాన్ని తీసుకురాలేదు. కానీ ‘బంగార్రాజు’ మాత్రం కచ్చితంగా ‘సంక్రాంతి’కి తీసుకురావాలని పట్టుదల ప్రదర్శించారు.. మొదటి సారి ఎందుకిలా?
నాగార్జున: అవునండి. చాలా పట్టుబట్టి ఇది పండగ సినిమా కాబట్టి అదే రోజు విడుదల చేయాలని మొదటే నిర్ణయించుకున్నాం. ఆగస్టు 25న మొదలుపెట్టాం. పండగకి వస్తున్నామని ఆరోజే టీమ్ అందరికీ చెప్పా. ఈసంక్రాంతికే ఎలాగైనా తీసుకురావాలి. లేదంటే ఆపేద్దాం. వచ్చే సంక్రాంతికి తీసుకొద్దామని చెప్పా. మా టీమ్ కూడా సహకరించడంతో అనుకున్నట్టే ఈ సంక్రాంతికే మీ ముందుకు వస్తున్నాం.
దర్శకుడు కల్యాణ్కృష్ణ గురించి?
నాగార్జున: తనతో చేయడానికి నేను చాలా ఇష్టపడతా, సౌకర్యంగా ఉంటుంది. బాలేదని చెబితే మరోసారి చేసుకొస్తాడు. కలం బలం ఎక్కువ. పాటలు కూడా బాగా రాస్తాడు. తను రాసిన ‘వాసివాడి తస్సాదియా’ కూడా ట్రెండింగ్ లిస్ట్లో ఉంది.
ఈ సినిమాలో పాట పాడారు కదా! దాని గురించి.. ?
నాగార్జున: అది పాట పాడినట్టు కాదండి! పద్యాలు చదివినట్టే...(నవ్వులు). మొదట డబ్బింగ్ చెబుదామని వెళ్లినట్టు వెళ్లా.. ట్రై చేయండి అన్నారు. చేస్తే బానే ఉంది. కొంతమందికి వినిపిస్తే బాగుందన్నారు. ఆ తర్వాత బాగా కసరత్తు చేసి పాడా.
నాగచైతన్య కూడా మీలా యాసను పలికించడంలో సెట్ అయ్యాడు కదా!
నాగార్జున: అవునండీ.. చాలా బాగా సెట్ అయ్యాడు. సినిమా చూశాక నాగచైతన్య నటన చూసి సర్ప్రైజ్ అవుతారు. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. ‘లవ్స్టోరి’, ‘మజిలీ’ చేసిన చైతూనే ఇది చేశాడా.. అన్న ఫీలింగ్ వస్తుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చైతూ చేయడం తొలిసారి.
ఈ సినిమాలో చాలా రొమాంటిక్గా కనిపించారు. దానికి కారణం ఎవరు?
నాగార్జున: ‘బంగార్రాజు’ పాత్ర వల్లే అండి! అందులో ‘బంగార్రాజు’కు సరసమంటే ఇష్టం. తాత- కొడుకు కన్నా తాత మనవడికి ఎక్కువ పోలికలు ఉంటాయి. ఆ పాయింట్ పట్టుకున్నాం.
మీరు రొమాంటికా..? లేదా ఏఎన్నార్ గారు రొమాంటికా..?
నాగార్జున: కాలం బట్టి (నవ్వులు). ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి.
మీకు ‘మన్మథుడు’ బ్రాండ్ ఉంది. అది చైతూ, అఖిల్ ఇద్దరిలో ఎవరికిస్తారు?
నాగార్జున: నేనేం చెప్పలేను. అది నాకు సినిమాతో వచ్చింది.
‘సోగ్గాడే’లో సర్ప్రైజ్గా అనుష్కని చూపించారు. మరి ఇందులో.. ?
నాగార్జున: చాలా ఉన్నాయండి. హీరోయిన్స్ అనే కాదు. వేరే సర్ప్రైజ్లూ ఉన్నాయి.
ఈ సినిమా సక్సెస్ని మీరు తీసుకుంటారా? చైతూకి ఇస్తారా?
నాగార్జున: నిర్మాణ విషయాలన్నీ పక్కన పెడితే చైతూకే ఇస్తా.
హీరోయిన్ కృతిశెట్టి గురించి..
నాగార్జున: ఆ అమ్మాయి.. తెలుగు నేర్చుకొని మాట్లాడుతోంది. అది నాకు బాగా నచ్చింది. హిందీ, ఇంగ్లిష్, తుళు వచ్చినా తెలుగులోనే మాట్లాడుతుంది. ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. సెట్కి టైంకి వస్తుంది. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలా ఉండదు. బయట ఆమె క్లాస్గా ఉంటుంది. కృతి శెట్టి ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్