NTR Jayanthi: ఆయన పెట్టిన భిక్ష వల్లే మీ ముందు ఉన్నా..: రాజేంద్రప్రసాద్‌

విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు తనకు దేవుడని సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఉదయాన్నే

Updated : 28 May 2022 13:32 IST

హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు తనకు దేవుడని సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఉదయాన్నే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని రాజేంద్రప్రసాద్‌ గుర్తుచేసుకున్నారు.

‘‘ఆయన ద్వారా నేను మద్రాస్‌ ఫిలిం స్కూల్‌లో చేరాను. ఆయన పెట్టిన భిక్ష వల్లే ప్రఖ్యాత నటుడిగా మీ ముందు ఉన్నాను. మనతో ఉన్న పది మందికి సాయం చెయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి. కొన్నేళ్లుగా ఆయన పక్కన ఉన్న వ్యక్తిని నేను. సమాజమే దేవాలయం అన్న మనిషి అతను. ఈ రోజు మా పెద్దాయన బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడిని. అలాంటి జన్మ తెలుగు ప్రజలు ఎప్పుడు చూస్తారో. ఎన్టీఆర్‌ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు మన అందరిపైనా ఉంటాయి’’ అని రాజేంద్రప్రసాద్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని