Adipurush: వామ్మో.. అక్కడ ‘ఆదిపురుష్‌’ టికెట్‌ ధర రూ.రెండు వేలట!

‘ఆదిపురుష్‌’ అడ్వాన్స్‌ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఓ థియేటర్‌లోని టికెట్‌ ధరలు తెలుసుకుని సినీ ప్రియులు అవాక్కవుతున్నారు.

Published : 15 Jun 2023 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush).. ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్‌-కృతిసనన్‌ నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ‘ఆదిపురుష్‌’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ పోర్టల్‌ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు.

కాగా, దిల్లీలోని పీవీఆర్‌ డైరెక్టర్స్‌ కట్‌ యాంబియెన్స్‌ మాల్‌లో ‘ఆదిపురుష్‌’ టికెట్‌ ధర చూసి అక్కడి వారందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే, అక్కడ ఒక్కో టికెట్‌ ధర రూ.2200. అవును మీరు చదివింది నిజమే.. పీవీఆర్‌ డైరెక్టర్స్‌ కట్‌ థియేటర్‌లో 9.15pm షోకి ‘ఆదిపురుష్‌’ (హిందీ) 2డీ వెర్షన్‌ చూడాలంటే ప్లాటినమ్‌ రూ.2000, ప్లాటినమ్‌ సుపీరియర్‌ రూ.2200 చెల్లించాల్సి ఉంది. ఇక, ఈ థియేటర్‌లో సాయంత్రం 7 గంటల షోకి 3డీ వెర్షన్‌ టికెట్‌ ధర రూ.2250 (ప్లాటినమ్‌ సూపీరియర్‌), రూ.2050 (ప్లాటినమ్‌)గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని