Ajith Kumar: చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్న నటుడు అజిత్‌

ప్రముఖ సినీ నటుడు అజిత్‌కుమార్‌ చెన్నై అపోలో ఆస్పత్రి నుంచి తిగిరి ఇంటికి చేరుకున్నారు. 

Published : 09 Mar 2024 16:55 IST

చెన్నై: ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌(Ajith Kumar) ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటీవల ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో అజిత్‌ ఆరోగ్యంపై వివిధ రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ వార్తలపై అజిత్‌ పీఆర్వో సురేశ్‌చంద్ర వివరణ ఇచ్చారు. ‘‘సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్‌ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెవి వెనక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని తెలిపి వాటికి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఆయన ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. దయచేసి ఇలా చేయొద్దని’’ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అజిత్‌ ఆరోగ్యంపై స్పష్టత రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో అజిత్‌ ‘విదా ముయార్చి’ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని