‘అల్లుడు అదుర్స్’ అనడం పక్కా
అల్లుడు సీను’తో అదిరిపోయేలా సినీ అరంగేట్రం చేసి.. ‘స్పీడున్నోడు’తో స్పీడు పెంచి.. ‘జయజానకీ నాయకా’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’.. వంటి చిత్రాలతో అదరగొట్టి.. మరోసారి ‘అల్లుడు అదుర్స్’తో అలరించేందుకు సిద్ధమయ్యాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్.
ఘనంగా ప్రిరిలీజ్ వేడుక
హైదరాబాద్: ‘అల్లుడు శీను’తో తెరంగేట్రం చేసి.. ‘స్పీడున్నోడు’తో స్పీడు పెంచి.. ‘జయ జానకీ నాయకా’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో అదరగొట్టి.. మరోసారి ‘అల్లుడు అదుర్స్’తో అలరించేందుకు సిద్ధమయ్యాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతోందీ చిత్రం. నభానటేశ్, అను ఇమాన్యుయెల్ కథానాయికలు. ప్రకాశ్రాజ్, సోనూసూద్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రి రిలీజ్ వేడుక నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడారు.. ‘ఈ సినిమాకు ప్రధాన కారణం బెల్లంకొండ సురేశ్గారు. నాకు మొదటి సినిమా ఇచ్చిన నిర్మాత ఆయన. అందుకే ఎంతో బాధ్యతగా ఎక్కడా రాజీ లేకుండా హీరో సాయి శ్రీనివాస్కు సరిపోయే కథ సిద్ధం చేశాను. ఆయన ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. తెరపై ఆయన కష్టం మీకు కచ్చితంగా కనిపిస్తుంది. హీరోయిన్ నభా కూడా బాగా పనిచేసింది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా నిర్మాత సుబ్రహ్మణ్యం ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా కీలకంగా పనిచేశారు. అందరి కష్ట ఫలితమే ఈ సినిమా. దేవీశ్రీప్రసాద్ గురించి చెప్పాలంటే.. ఒక ఫోన్ చేసి అడగ్గానే సినిమాకు సరే అన్నారాయన. చాలా మంచి సంగీతం ఇచ్చారు. చాన్నాళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులు మంచి పాటలను ఆస్వాదిస్తున్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఈ ప్రిరిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం. ఈ సంక్రాంతికి అందరితో ఈ ‘అల్లుడు’ శెభాష్ అనిపించుకుంటాడు’’ అని డైరెక్టర్ అన్నారు.
కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత గంజి రమేశ్, సుబ్రహ్మణ్యం గారు సినిమాకు వెన్నెముకలా నిల్చున్నారు. డైరెక్టర్ వాసు.. నన్ను ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ఆయన ఈ సినిమా కథ మీద నాలుగు నెలలు కష్టపడ్డారు. కరోనా సమయంలోనూ ఆయన విశ్రాంతి తీసుకోలేదు. సినిమాలో నటులందరికీ ప్రత్యేక కృతజ్ఞలు. అందరూ ఎంతో కష్టపడ్డారు. నేను పనిచేసిన హీరోయిన్లందరిలో నభానటేశ్ చాలా ప్రత్యేకం. అను ఇమాన్యుయెల్ పాత్ర మీకు సర్ప్రైజ్లాంటిది. దేవీశ్రీప్రసాద్ గారి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జనవరి 14న మా సినిమా మీ అందర్నీ అలరిస్తుంది’’ అని శ్రీనివాస్ అన్నారు.
ఇదీ చదవండి..
‘చంటి’ ఆ హీరోతో తీద్దామనుకున్నారు.. కానీ..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!