Anasuya Bharadwaj: అందాల రూపసి...

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రధారులుగా... సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్జా’. శివశంకర్‌ పైడిపాటి నిర్మాత. కామినేని శ్రీనివాస్‌ సమర్పకులు. 

Updated : 05 Apr 2022 07:14 IST

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రధారులుగా... సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్జా’. శివశంకర్‌ పైడిపాటి నిర్మాత. కామినేని శ్రీనివాస్‌ సమర్పకులు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాలోని తొలి పాటని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘అందాల రూపసి... తరంగాల  కర్కసి... అంతుచూసే రక్కసి తనేలే’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ నటుడు ఉత్తేజ్‌, ఆయన కూతురు పాట ఆలపించారు. భాష్య శ్రీ రచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత రవి పైడిపాటి, రచయిత భవానీ ప్రసాద్‌, సమీర్‌, పురుషోత్తపు బాబీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని