anupama parameswaran: ధ్రువ్‌ విక్రమ్‌తో అనుపమ ఆట

ధ్రువ్‌ విక్రమ్‌ ఓ జీవిత కథలో నటించనున్నారు. మారి సెల్వరాజ్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాని అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నీలమ్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Updated : 13 Mar 2024 10:09 IST

ధ్రువ్‌ విక్రమ్‌ ఓ జీవిత కథలో నటించనున్నారు. మారి సెల్వరాజ్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాని అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నీలమ్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇందులో ధ్రువ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కబడ్డీ క్రీడాకారుడు మానతి పి.గణేశన్‌ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఆ పాత్రనే తెరపై ధ్రువ్‌ పోషించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన కబడ్డీ ఆటలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈనెల నుంచే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని